ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో ఎన్డీయే ప్రభుత్వం తన హయాంలో సాధించిన విజయాల గురించి గొప్పగా చెప్పుకోవచ్చు, అందులో నోట్ల రద్దు నుంచి సర్జికల్ స్ట్రైక్ వరకు స్వచ్ఛా భారత్ నుంచి మేకిన్ ఇండియా వరకు ఎన్నో పథకాలు, కార్యక్రమాలు వుండవచ్చు. నోట్ల రద్దుతో కేంద్రప్రభుత్వానికి అదాయం బాగా పెరిగిందని చెప్పుకుంటున్న ప్రభుత్వం.. ఆదాయం వస్తున్నా.. దేశాన్ని మాత్రం అప్పుల భారతంగా మార్చేసింది. డిసెంబర్ తో ముగిసిన ఈ వార్షిక మూడో త్రైమాసానికి ప్రభుత్వం ఏకంగా రూ.83.40 లక్షల కోట్ల రుణభారంలో వుందని తాజా గణంకాలు స్పష్టం చేస్తున్నాయి.
దేశంలో విప్లవాత్మక మార్పలు పెద్దగా చోటుచేసుకోలేకపోయినా.. సర్ధర్ వల్లభబాయ్ పటేల్ విగ్రహావిష్కరణ.. శతాబ్ది ఎక్స్ ప్రెస్ రైలు స్థానంలో వందే భారత్ రైలు ప్రారంభం.. మరోవైపు గుజరాత్ లోని అహ్మదాబాద్ నుంచి ముంబై వరకు స్పీడ్ రైలు పనులు వేగంగా సాగుతున్నాయి. అయితే భారత్ దేశానికి మాత్రం ఈ నాలుగున్నరేళ్ల కాలంలో అప్పుల భారం అంతకంతకూ పెరిగింది.
నరేంద్రమోడీ సర్కార్ పరిపాలన దేశంపై ఒక పెను భారాన్ని తెచ్చి నెత్తిన పెట్టింది. ఈ కష్టం రాబోయే ప్రభుత్వాలకు పెద్ద గుదిబండగా మారనుంది. మోడీ ప్రభుత్వ నాలుగున్నరేళ్ల పరిపాలనలో ప్రభుత్వం తెచ్చిన మొత్తం అప్పులు 50శాతం పెరిగి రూ.82 లక్షల కోట్లకు చేరుకుంది. ఇటీవల ప్రభుత్వ రుణంపై జారీ చేసిన స్టేటస్ పేపర్ 8వ సంచిక ద్వారా ఈ విషయం వెల్లడైంది.
ప్రభుత్వ రుణాలపై ఆర్థిక మంత్రిత్వశాఖ జారీ చేసిన డేటాలో సెప్టెంబర్ 2018 నాటి గణాంకాలతో పోల్చి చెప్పింది. దీని ప్రకారం సెప్టెంబర్ 2018 వరకు కేంద్ర ప్రభుత్వంపై మొత్తం రూ.83.40 లక్షల కోట్ల రుణభారం ఉంది. జూన్ 2014 వరకు ప్రభుత్వంపై మొత్తం రూ.54.90 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి. ఈ విధంగా మోడీ సర్కార్ హయాంలో భారతదేశంపై ఇప్పుడు మొత్తం అప్పులు దాదాపుగా రూ.28 లక్షల కోట్లు పెరిగిపోయాయి. ఈ కాలంలో పబ్లిక్ డెట్ లో ప్రభుత్వ రుణం 51.7% పెరిగి రూ.48 లక్షల కోట్ల నుంచి రూ.73 లక్షల కోట్లు అయింది. మధ్యంతర రుణం 54% పెరుగుదలతో రూ.68 లక్షల కోట్లు కావడమే దీనికి ప్రధాన కారణంగా చెబుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Apr 03 | ఉత్తరప్రదేశ్ లో జరగనున్న పంచాయతీ ఎన్నికలు ఈసారి గ్లామరెస్ గా మారనున్నాయి. తాను పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు ఫెమినా మిస్ ఇండియా -2015 రన్నరప్ దీక్షాసింగ్ ప్రకటించింది. జౌన్ పూర్ జిల్లా బక్షా... Read more
Apr 03 | ఎనబై ఏళ్లకు పైబడిన వయస్సులోనూ అమె తన జీవనం కోసం అలోచించకుండా పది మంది కడుపు నింపే పనికి పూనుకున్నారు. అందరూ తన బిడ్డల లాంటి వారేనని, అమె అందరికీ అందుబాటు ధరలోనే ఇడ్లీలు... Read more
Apr 03 | బెంగళూరు డ్రగ్స్ కేసు..శాండిల్ వుడ్ పరిశ్రమను షేక్ చేసి అక్కడి ప్రముఖులను ఊచలు లెక్కపెట్టించిన కేసుకు సంబంధించిన లింకులు తెలంగాణలోనూ బయటపడ్డాయి. ఆ మధ్య పలువురు నటుల చు్ట్టూ తిరిగిన ఈ కేసులో వారి... Read more
Apr 03 | అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్న అసోంలో బీజేపీకి దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. అసోం బీజేపి ప్రతినిధిగా ముఖ్యమంత్రి సోనూవాల్ ను అధిగమించి మరీ దూసుకుపోతున్న రాష్ట్ర మంత్రి హిమంత విశ్వశర్మపై చర్యలు తీసుకున్నఎన్నికల కమీషన్... Read more
Apr 03 | తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం అంకానికి మరికొన్ని గంటల వ్యవధిలో తెరపడుతుందన్న తరుణంలో రాజకీయ పార్టీల మధ్య విమర్శలు ప్రతివిమర్శలు, అరోపణలు ఊపందుకుంటున్నాయి. మరీముఖ్యంగా బీజేపిని టార్గెట్ చేస్తున్న ప్రతిపక్ష పార్టీ డీఎంకే అధినేత... Read more