ఎన్నికల వేళ...ఆంధ్రప్రదేశ్ ఓటర్ల వ్యక్తిగత విషయాలు బట్టబయలు కావడం కలకలం రేపుతోంది. ఐటీ గ్రిడ్ కంపెనీ కేసులో సైబరాబాద్ పోలీసులు జరుపుతున్న విచారణలో విస్తుగొలిపే అంశాలు బయటపడుతున్నాయి. సేవా మిత్రలో ఉన్న సమాచారం మొత్తం అమెజాన్ సర్వర్లో నిక్షిప్తం కావడం ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఈ కేసు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసులో ఎవరున్నా, ఎంతటివారైనా వదిలేది లేదని సైబరాబాద్ సీపీ సజ్జనార్ ప్రకటించారు.
ఇవాళ నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఏపీ ఓటర్ల వివరాలు టీడీపీ యాప్ సేవా మిత్రకు ఎలా వస్తాయి ? ప్రభుత్వ డేటాలోని అన్ని వివరాలు సేవా మిత్ర యాప్లో ఉన్నాయని పేర్కొన్న సీపీ అసలు సెన్సిటివ్ డేటా ప్రైవేటు సంస్థకు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. సేవా మిత్ర సమాచారం అంతా అమెజాన్ సర్వర్ లో నిక్షిప్తం చేశారని.. ఇలా ఎందుకు చేశారన్న వివరాలు తమ దర్యాప్తులో వెల్లడవుతాయని ఆయన తెలిపారు.
డేటాను దుర్వినియోగం చేసి ఎన్నికల్లో లబ్ది పొందాలని అనుకున్నారనే అనుమానం వ్యక్తం చేశారు పోలీస్ కమీషనర్. లబ్ధిదారుల డేటా ఎలా తెచ్చారో దర్యాప్తులో తేలుతుందని, విచారణలో కీలకమైన ఆధారాలు సేకరించినట్లు చెప్పారు. ఎన్నాళ్ల నుంచి డేటా వారి దగ్గరుందో దర్యాప్తులో తేలుతుందన్నారు. అక్రమంగా ఓట్లు తొలగిస్తున్నారని ఏపీలో 50 కేసుల వరకు నమోదయ్యాయని.. డేటాతో ఎవరినైనా వ్యక్తిగతంగా బ్లాక్ మెయిల్ చేయొచ్చని సీపీ చెప్పారు.
ఐటీగ్రిడ్ సంస్థ కేసులో ఏపీ పోలీసులు పరిధి దాటి ప్రవర్తించారని సీపీ సజ్జనార్ అన్నారు. ఏపీ పోలీసులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నిందితులను కస్టడీలోకి తీసుకున్నామనేది అవాస్తవమని.. సాక్షులుగా పిలిపించి విచారించామని వెల్లడించారు. కోర్టును తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేశారని తెలిపారు. అటెన్షన్ డైవర్ట్ చేయడానికే ఇలా చేశారని ఆరోపించారు. హైకోర్టులో హెబియస్ కార్పస్ దాఖలు చేయడాన్ని తప్పుబట్టారు. నిందితులను తాము విచారిస్తున్నట్లు చెప్పిన తర్వాత కూడా హెబియస్ కార్పస్ను ఆశ్రయించడం సరికాదన్నారు. దీనిపై హైకోర్టు స్పష్టమైన సూచనలిచ్చిందని తెలిపారు.
ఐటీగ్రిడ్ సంస్థలో ల్యాప్టాప్లు, హార్డ్డిస్క్లు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లతో పాటు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నామని సీపీ సజ్జనార్ తెలిపారు. ఈ కేసులో అమెజాన్ సంస్థకు నోటీసులు ఇచ్చామని చెప్పారు. కేసులో అశోక్ను ప్రధాన నిందితుడిగా గుర్తించామని తెలిపిన సజ్జనార్.. అతడు సరెండర్ కావాలని కోరుతున్నట్లు పత్రికాముఖంగా చెప్పారు. ఐటీగ్రిడ్ సంస్థకు అశోక్ సీఈవోగా ఉన్నట్లు తెలుస్తోంది. అతడు ఏపీలోనే ఉన్నాడని పోలీసుల అనుమానం.
లోకేశ్వర్ రెడ్డి ఫిర్యాదుతో ఐటీగ్రిడ్లో సోదాలు చేశామని సజ్జనార్ తెలిపారు. కేసు తమ పరిధిలో ఉంటే ఏపీ పోలీసులు ఇష్టారీతిలో కల్పించుకుంటున్నారని సీపీ సజ్జనార్ ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ పోలీసులపై కూకట్పల్లిలో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఐటీగ్రిడ్ సంస్థపై మాదాపూర్ పీఎస్లో ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఇప్పటివరకు రేగొండ భాస్కర్, విక్రంగౌడ్, ఫణికుమార్, చంద్రశేఖర్ను విచారించినట్లు తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more