భారత ఫైలట్ తాము అదుపులోకి తీసుకున్నామని చెప్పిన పాకిస్థాన్ వార్తల్లో ఎలాంటి నిజం లేదని.. తొలుత భావించినా.. ఆ తరువాత మాత్రం అందులో వాస్తవముందని గ్రహించాయి. భారత ఫైలెట్ ను అదుపులోకి తీసుకున్నామని చెబుతూ. ఇందుకు సంబంధించిన పాత వీడియోలను వదిలడంతో అది పాత వీడియోలు, ఫేక్ వీడియోలని ముందుకు దేశంలోని నెట్ జనులు తేల్చేశారు. ఆ తరువాత పాక్ యుద్ద విమానాలను తరమికొట్టే క్రమంలో భారత వాయుసేనకు చెందిన మిగ్ తప్పిపోయినట్లుగా వస్తున్న వార్తలే నిజమయ్యాయి.
ఈ మేరకు భారత విదేశాంగ అధికారులు అంగీకరించారు. భారత పైలెట్ ను అదుపులోకి తీసుకున్న తాజా చిత్రాలు, వీడియోలను పాకిస్థాన్ ఆన్ లైన్ లో కూడా పెట్టింది. దీంతో తాజాగా దీనిపై మీడియా సమావేశం పెట్టిన విదేశాంగ అధికార ప్రతినిధ రవీష్ కుమార్.. భారత వాయుసేనకు చెందిన ఓ ఫైలట్ తప్పిపోయినట్లు నిర్ధారించారు. పాకిస్థన్ ఇప్పటికే ఒక ఇండియన్ ఫైలట్ తమ ఆధీనంలో ఉన్నట్లు ప్రకటించారు. ఆ వార్తలు నిజమేనని భారత అధికారులు నిర్ధారించారు.
మంగళవారం తెల్లవారుజామన భారత వైమానిక దాడులు అనంతరం పాకిస్థాన్ ఇవాళ ఉదయం భారత్పై దాడులకు ప్రయత్నించిందన్నారు. అయితే భారత సైన్యం పాక్ దాడుల్ని సమర్థవంతంగా తిప్పికొట్టిందన్నారు. ఇరుదేశాల పరస్పర దాడుల్లో పాకిస్థాన్కు చెందిన f-16 ఫైటర్ జెట్ను నేలమట్టం చేశామన్నారు. అయితే ఈ దాడుల్లో మిగ్-21 విమానం పాక్ భూభాగంలో కూలిపోయింది. ఈ ఘటనలో మిగ్ -21 భారత పైలట్ తప్పిపోయారని విదేశాంగ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ నిర్ధారించారు.
#WATCH Raveesh Kumar, MEA: One Pakistan Air Force fighter aircraft was shot down by Indian Air Force. In this engagement, we have lost one MiG 21. Pilot is missing in action. Pakistan claims he is in their custody. We are ascertaining the facts. pic.twitter.com/Bm0nVChuzF
— ANI (@ANI) February 27, 2019
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more