పాకిస్థాన్ కు ఎయిర్ ఫోర్స్ కు చెందిన ఎఫ్-16 యుద్ధ విమానాన్ని భారత బలగాలు కూల్చివేశాయి. భారత గగన తలంలోకి వచ్చిన ఈ విమానంపై భారత బలగాలు కాల్పులు జరిపాయి. దీంతో, అది వెనుదిరిగి వెళ్లే ప్రయత్నం చేసింది. ఈ నేపథ్యంలో భారత్ లోని నౌషరా సెక్టార్ కు అవతలి వైపు పాక్ ఆక్రమిత కశ్మీర్ లో ఉన్న లామ్ వ్యాలీలో 3 కిలోమీటర్ల దూరంలో విమానం కుప్పకూలిపోయింది. విమానం కుప్పకూలడంతో పైలట్ ప్యారాషూట్ ద్వారా కిందకు దిగినట్లు కనిపించింది. అయితే పైలట్ ను అదుపులోకి తీసుకున్న భద్రతా బలగాలు స్థానిక పోలీసులకు అప్పగించింది.
జమ్మూకశ్మీర్ లోని నౌషేరా సెక్టార్ లోకి దూసుకోచ్చిన పాక్ యుద్ధ విమానాలు.. భారత వాయుసేన(ఐఏఎఫ్) ఫైటర్ జెట్లు వెంబడించడంతో పలాయనం చిత్తగిస్తూ కూడా తమ వక్రబుద్దిని బయటపెట్టుకున్నాయి. పారిపోయే ముందు భారత భూభాగంపై బాంబు దాడులు చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అయితే ఈ దాడిలో పౌరులు, ఆర్మీ సిబ్బంది ఎవరైనా చనిపోయారా? ఎంత నష్టం వాటిల్లింది? అనే వివరాలు ఇంకా తెలియరాలేదు. భారత వైమానిక దళం (ఐఏఎఫ్) నిన్న చేపట్టిన సర్జికల్ స్ట్రయిక్స్ లో పాకిస్థాన్ లోని బాలాకోట్ లో 350 మంది ఉగ్రవాదులు హతమయ్యారు.
అయితే పాక్ ఎఫ్ 16 యుద్దవిమానం కూల్చివేసిన నేపథ్యంలో పాకిస్తాన్ విదేశాంగశాఖ అధికార ప్రతినిధి మహమ్మద్ ఫైసల్ స్పందించారు. తమ విమానాలు వాస్తవాధీన రేఖ వెంబడి మాత్రమే ప్రయాణించాయని, తమ భూభాగంలోనే బాంబులను జార విడిచామని ప్రభుత్వం తరఫున ఓ అధికారిక ప్రకటన విడుదలైంది. స్వీయ రక్షణకు తాము సిద్ధంగా ఉన్నామన్న సంకేతాలు పంపేందుకే ఈ పని చేశామని తెలిపింది. ఇండియా మాదిరిగా తాము రాత్రిపూట రాలేదని, పట్టపగలే వచ్చామని తెలిపింది. ఇదేమీ ప్రతీకార చర్య కాదని, మిలటరీని లక్ష్యంగా చేసుకోలేదని, సామాన్యులను టార్గెట్ చేయలేదని తెలిపింది. తాము ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తే, పరిస్థితి ఇలా ఉండదని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్ర రూపం దాల్చాయి. పరిస్థితి యుద్ధం వైపు వెళ్లేలా కనిపిస్తోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more