ప్రముఖ దర్శకుడు కోడిరామకృష్ణ తీవ్రమైన అస్వస్థతకి గురయ్యాడు. దీంతో ఆయనను కుటుంబసభ్యులు ఆయనను హైదరాబాద్ - గచ్చీబౌలీలోని ఏఐజీ హాస్పిటల్ కు తరలించారు. అస్పత్రి వైద్యులు ఆయనను ఐసీయూలో ఉంచి వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారని సమాచారం. గతంలో పెరాలసిస్ రావడంతో కొంతకాలంపాటు బాధపడిన ఆయన ఆ తరువాత కోలుకున్నారు. అయినా ఆరోగ్యం సహకరించకపోవడంతో ఇంటి పట్టునే ఉంటున్నాడు.
కాగా ఇవాళ మరోమారు అకస్మాత్తుగా ఆయన అస్వస్థతకు గురికావడంతో.. అస్పత్రికి తరలించారు. తెలుగు తెరపై కుటుంబ కథా చిత్రాలను అద్భుతంగా ఆవిష్కరించిన దర్శకులలో కోడి రామకృష్ణ ఒకరు. 'ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య' సినిమాతో దర్శకుడిగా ఆయన పరిచయం జరిగింది. మధ్యతరగతి జీవితాలను .. అందులోని ఒడిదుడుకులతో పాటు రాజకీయాలపై కూడా తనదైన శైలిలో చిత్రాలను రూపోందించి.. ప్రజలను జాగృత పర్చాడు.
తన చిత్రాల ద్వారా నిత్యం ప్రేక్షకులను మెప్పించారు. ఫాంటసీ చిత్రాలను సైతం తనదైన శైలిలో తెరకెక్కించి మంత్రముగ్ధులను చేసిన ఘనత ఆయన సొంతం. 'అమ్మోరు' .. 'అరుంధతి' సినిమాలు అందుకు నిదర్శనంగా నిలుస్తాయి. ఎలాంటి స్టార్ హీరోలు, నటులు లేకున్నా దేవుళ్లు చిత్రాన్ని రూపోందించి ఘనవిజయాన్ని అందుకునేలా చేసిన మార్కు కోడి రామకృష్ణది. మెగాస్టార్ నటించిన ఇంట్లో రామయ్య.. వీధిలో కృష్ణయ్య చిత్రం నుంచి ఆయన దర్శక ప్రస్థానం ప్రారంభమైంది.
టాలీవుడ్ లో పలు సంచలన విజయాలను సాధించిన చిత్రాలను అందించాడు కోడిరామకృష్ణ. నందమూరి బాలకృష్ణ , డాక్టర్ రాజశేఖర్ , సుమన్ లు నటించిన పలు బ్లాక్ బస్టర్ చిత్రాలకు దర్శకత్వం వహించాడు కోడిరామకృష్ణ. ఈ హీరోలతోనే కాకుండా నాగార్జున , వెంకటేష్ , మోహన్ బాబు , వినోద్ కుమార్ తదితర హీరోలతో కూడా పలు సూపర్ హిట్స్ తీసాడు. కోడిరామకృష్ణ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరడంతో త్వరగా కోలుకోవాలని పలువురు చిత్ర ప్రముఖులు కోరుకుంటున్నారు .
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more