పుల్వామా సమీపంలోని అవంతిపురాలో జాతీయ రహదారిపై విధులకు హాజరవుతున్న సీఆర్పీఎఫ్ జవాన్ల కాన్వాయ్ పై ఆత్మాహుతి దాడి వెనుకనున్న మాస్టర్ మైండ్, ఐఈడీ నిపుణుడు, పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైషై మహమ్మద్ టాప్ కమాండర్ అబ్దుల్ రషీద్ ఘాజీని భారత అర్మీ మట్టుబెట్టింది. 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను లక్ష్యంగా చేసుకుని దొంగచాటుగా ఆత్మహుతికి దాడికి పాల్పడిన ఘటనలో పాల్గోన్న మరో ఉగ్రవాదిని భారత సైన్యం ప్రాణాలతో పట్టుకుందని సమాచారం.
అర్మీ వాహనాలను టార్గెట్ చేసుకుని దాడికి పాల్పడిన ఆత్మహుతికి పాల్పడిన ఉగ్రవాది ఆదిల్ కు శిక్షణ ఇచ్చిన జైషే మహమ్మద్ టాప్ కమాండర్ కూడా అబ్దుల్ రషీద్ ఘాజీనేనని భారత భద్రతాదళాలు నిర్థారించాయి. కాగా ఉగ్రవాది ఘాజీ రషీద్ ఈ ఘటన తరువాత ఓ ఇంట్లో నక్కిన ఉగ్రవాదలు అటుగా వచ్చిన ఇండియన్ ఆర్మీపై ఇవాళ ఉదయం కాల్పులు జరిపాయి. ఈ దాడిలో ఒక మేజర్ తో పాటుగా ముగ్గురు జవాన్లు కూడా ప్రాణాలను కొల్పోయారు.
ఈ ఘటనతో మరోమారు పుల్వామా ప్రాంతం మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. వెంటనే రంగంలోకి దిగిన భారత భద్రతా దళాలు ఉగ్రవాదులు నక్కిన ఇంటిని చుట్టుముట్టి.. కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో జైషే మహమ్మద్ టాప్ కమాండర్ సహా మరో ఉగ్రవాదిని భారత సైన్యం కొద్దిసేపటి క్రితం మట్టుబెట్టింది. ఆత్మాహుతి దాడి జరిగిన అవంతిపోరా ప్రాంతానికి 5 కిలోమీటర్ల దూరంలో గత రాత్రి నుంచి ఎన్ కౌంటర్ జరుగుతూ ఉంది.
కాగా ఓ ఇంట్లో నక్కిన ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించి, ఓ మేజర్, ముగ్గురు జవాన్లను, ఓ పౌరుడిని కాల్చిచంపారు. ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి, ఎన్ కౌంటర్ ప్రారంభించిన సీఆర్పీఎఫ్, జమ్మూ కాశ్మీర్ భద్రతా దళాలు, ఘాజీ రషీద్ ను హతమార్చాయి. మరణించింది రషీదేనని ఓ సైనికాధికారి స్పష్టం చేశారు. మరో ఉగ్రవాది ప్రాణాలతో పట్టుబడినట్టు తెలుస్తోంది. ఈ ఎన్ కౌంటర్ ఇంకా కొనసాగుతోంది. మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more