తెలుగు రాష్ట్రాలలో కలకలం రేపిన గుంటూరు జిల్లాలోని ప్రేమ జంటపై దాడి కేసును పోలీసులు గంటల వ్యవధిలోనే చేధించారు. ఈ దారుణానికి ఒడిగట్టింది ప్రియుడి స్నేహితులేనని తేల్చారు. ఇద్దరు కలిసి ఉన్నప్పుడు అక్కడకు చేరుకున్న శ్రీనివాస్ స్నేహితులు... ఇద్దరిపై దాడి చేసి యువతిపై సామూహిక అత్యాచారానికి తెగబడ్డారని.. అయితే వారి ప్రయత్నాలను తీవ్రంగా ప్రతిఘటించడంతో అమెపై అగంతకులు ఇనుప రాడ్లతో దాడి చేయడంతో అమె అక్కడికక్కడే మృతి చెందిన విషయం తెలిసిందే.
అయితే ఈ కేసును సవాల్ గా తీసుకున్న పోలీసులు గంటల వ్యవధిలోనే నిందితుల్ని అరెస్ట్ చేశారు. శ్రీనివాసరావు స్నేహితులే ఈ దారుణానికి తెగబడ్డారంటూ, ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఇద్దరి సెల్ ఫోన్ డేటా, కాల్ లిస్ట్ ఆధారంగా వెంటనే నిందితులెవరో గుర్తించారు. నిందితులిద్దరూ బైక్ పై వెళ్తున్నట్లు సమాచారం అందుకున్న పొలీసులు.. వారిని పట్టుకున్నారు. మరోవైపు జ్యోతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహణకు తరలించారు.
సోమవారం రాత్రి తాడేపల్లి, మహానాడు రోడ్డుకు చెందిన చుంచు శ్రీనివాసరావు, అతని ప్రియురాలు అంగడి జ్యోతితో కలిసి సర్టిఫికెట్ల కోసం గుంటూరు వెళుతుండగా, అమరావతి స్టేడియం సమీపానికి వీరు చేరుకోగానే.. అక్కడే వీరి రాకకోసం మాటు వేసిన శ్రీనివాసరావు స్నేహితులు వారిపై దాడి చేసి.. సమీపంలోని పోలాల్లోకి తీసుకెళ్లారు. జ్యోతిపై సామూహిక అత్యాచారానికి యత్నించారు. ఈ కేసులో నిందితులు ఇద్దరేనా.. లేక ఇంకా ఎవరైనా వున్నారా అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు.
కాగా, జరిగిన ఘటనపై స్పందించిన జ్యోతి సోదరుడు, తన చెల్లిని శ్రీనివాసరావు తన స్నేహితులతో కలిసి చంపించాడని తీవ్ర ఆరోపణలు చేశాడు. తన సోదరి శ్రీనివాసరావును ప్రేమించిందని, పెళ్లి చేసుకోవాలని కొంతకాలంగా అడుగుతుంటే కాలయాపన చేస్తూ వచ్చాడని, చివరికిలా దారుణానికి ఒడిగట్టారని ఆరోపించాడు. వారు మాట్లాడుకోవాలంటే, రోడ్డు పక్కనే కూర్చునేవారని, రోడ్డుకు ఇంతదూరం తీసుకురావాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించాడు. గతంలో తాను శ్రీనివాసరావును హెచ్చరించానని, కొంతకాలం దూరంగా ఉన్న అతను తిరిగి ప్రేమ పేరిట దగ్గరయ్యాడని చెప్పాడు. తమ కుటుంబానికి న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
జ్యోతి హత్యకేసులో సంచలన అరోపణలు వెలుగులోకి రావడంతో.. పోలీసులు కూడా ఆ దిశగా కేసును దర్యాప్తు చేస్తున్నారు. దాడి ఘటనకు ముందు శ్రీనివాసరావు సెల్ ఫోన్ నుంచి కొందరు స్నేహితులకు ఫోన్ కాల్స్ వెళ్లాయని, వారే అత్యాచారానికి పాల్పడ్డారని, శ్రీనివాసరావుపై అనుమానం రాకుండా ఉండేందుకు అతన్ని కూడా కొట్టారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక మర్డర్ వెనుక కులాంతర ప్రేమ కోణం ఏమైనా ఉందా? అనే దిశగా విచారిస్తున్నామని అన్నారు. శ్రీనివాసరావు బీసీ కులానికి చెందగా, జ్యోతి ఎస్టీ అని చెబుతున్న పోలీసులు, శ్రీనివాసరావును పూర్తి స్థాయిలో విచారిస్తేనే అసలు విషయం తెలుస్తుందని పోలీసులు బావిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more