పశ్చిమబెంగాల్ లోని మమతా బెనర్జీ సర్కార్ పై మరోమారు అధిపత్యం కోసం ప్రయత్నించిన బీజేపి పార్టీ బొక్కబోర్లా పడింది. లౌడ్స్పీకర్ల వినియోగంపై నిషేధం విధించడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన బీజేపి.. సర్కార్ తీరును నిరసిస్తూ దాఖలు చేసిన పిటిషన్ ఇవాళ దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో విచారణకు వచ్చింది. ఈ పిటిషన్ ను పరిశీలించిన అత్యున్నత న్యాయస్థానం బీజేపీ వాదనను తోసిపుచ్చింది. పిటిషన్ను కొట్టేసింది.
అదే సమయంలో మమతా సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించింది. దేశంలో రాజకీయ పార్టీల ప్రచారాలు, ర్యాలీల కంటే పిల్లల చదువులే ముఖ్యమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. 2013లో మమత బెనర్జీ సారథ్యంలోని తృణముల్ కాంగ్రెస్ ప్రభుత్వం ఫిబ్రవరి, మార్చి నెలల్లో లౌడ్ స్పీకర్ల వినియోగంపై నిషేధం విధించింది. ఈ రెండు నెలలు విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధమవుతుంటారని, వారికి ఈ లౌడ్స్పీకర్ల రణగొణ ధ్వనులు ఇబ్బంది కలిగిస్తాయని భావించిన మమత ఈ నిషేధాన్ని అమలు చేశారు.
అయితే.. నివాస ప్రదేశాల్లో, విద్యా సంస్థలు ఉన్న ప్రాంతాల్లో మాత్రమే ఈ నిషేధం అమలులో ఉంటుంది. మమత అమల్లోకి తీసుకొచ్చిన ఈ నిషేధం రాజకీయ పార్టీల హక్కులకు భంగం కలిగించే విధంగా ఉందని, ప్రజల మద్దతు కూడగట్టుకునేందుకు సభలు నిర్వహించడం, ప్రసంగాలు ఇవ్వడం భావ ప్రకటనా స్వేచ్ఛ అనేది బీజేపీ వాదన. కోర్టు బీజేపీ వాదనకు ఏకీభవించకపోవడమే కాకుండా పిటిషన్ను కొట్టేస్తూ తీర్పునిచ్చింది.
దీంతో సుప్రీం కోర్టులో బీజేపీకి మరోసారి ఎదురుదెబ్బ తగిలినట్టయింది. బీజేపీ ర్యాలీకి మమత ప్రభుత్వం అనుమతిని నిరాకరించడంతో ఇటీవల సుప్రీం కోర్టును ఆశ్రయించిన బీజేపీకి చుక్కెదురైన సంగతి తెలిసిందే. లోక్సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ నుంచి మెజార్టీ స్థానాలు కైవసం చేసుకోవాలని బీజేపీ భావిస్తోంది. భారీగా ర్యాలీలు, సభలకు ప్లాన్ చేసింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more