కష్టపడిన సొమ్ము ఎక్కడికెళ్లినా తిరిగి వస్తుందన్న పెద్దలు చెప్పే నానుడి మరోమారు నిజమైంది. అదేంటి సొమ్మంటే పదో పరకా అనుకుంటున్నారా.. కాదు.. ఏకంగా పది లక్షల రూపాయలు. అయితే ఇక్కడ ఈ డబ్బు లభ్యం కావడానికి మాత్రం ముఖ్యకారణం ఓ ఆటోవాలా నిజాయితి. రూపాయి బిల్ల దొరికితేనే ఎవరికీ కనిపించకుండా తీసుకుని జేబులో వేసుకునేవాళ్లు.. అవతలి వాడి వద్ద డబ్బు వుందని తెలిస్తే చాలు దాన్ని ఎలా నొక్కేయ్యాలా అని అలోచించేవాళ్లు వున్న ఈ రోజుల్లో.. ఏకంగా పది లక్షల రూపాయలు లభించినా.. దానిని తీసుకెళ్లి వారికి అప్పగించిన అటో డ్రైవర్ నిజాయితీ నిజంగా ప్రశంసనీయం..
వివరాల్లోకి వెళ్తే.. సిద్దిపేటకు చెందిన కొత్తూరు కృష్ణ, ప్రసాద్ అన్నదమ్ములు వారు హైదరాబాద్ గచ్చిబౌలీలోని శ్రీరామ్ నగర్ కాలనీ ఓ ఫ్లాట్ కొనుగోలు చేయాలని భావించారు. అందులో భాగంగా ఇవాళ ఫ్లాట్ బిల్డర్ కు పది లక్షల రూపాయాలను అడ్వాన్స్ గా చెల్లించాలని బ్యాంక్ నుంచి రూ.10 లక్షలు విత్ డ్రా చేసుకుని ఆటోలో వస్తున్నారు. అయితే ఆ సమయంలో కంగారులో డబ్బు ఉన్న బ్యాగును ఆటోలోనే మరచిపోయారు.
కొద్దిసేపటి తర్వాత బ్యాగును గుర్తించిన ఆటో డ్రైవర్ జార్పుల రమేశ్ అందులో రూ.10 లక్షల డబ్బు ఉండటాన్ని గమనించాడు. ఎంతోమంది తన ఆటో ఎక్కుతారు కాబట్టి .. మరచిపోయిన వారు ఎవరో గుర్తించలేకపోయారు. వెంటనే దగ్గర్లో ఉన్న పోలీస్ స్టేషన్కు వెళ్లి బ్యాగును అప్పగించారు. అయితే అప్పటికే కృష్ణ, ప్రసాద్ సోదరులు మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో వారి సమక్షంలోనే పోలీసులు బ్యాగును వారికి అప్పగించారు. నిజాయితీతో బ్యాగును అప్పగించిన ఆటోడ్రైవర్ను పోలీస్ అధికారులు ప్రశంసించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more