కష్టపడిన సొమ్ము ఎక్కడికెళ్లినా తిరిగి వస్తుందన్న పెద్దలు చెప్పే నానుడి మరోమారు నిజమైంది. అదేంటి సొమ్మంటే పదో పరకా అనుకుంటున్నారా.. కాదు.. ఏకంగా పది లక్షల రూపాయలు. అయితే ఇక్కడ ఈ డబ్బు లభ్యం కావడానికి మాత్రం ముఖ్యకారణం ఓ ఆటోవాలా నిజాయితి. రూపాయి బిల్ల దొరికితేనే ఎవరికీ కనిపించకుండా తీసుకుని జేబులో వేసుకునేవాళ్లు.. అవతలి వాడి వద్ద డబ్బు వుందని తెలిస్తే చాలు దాన్ని ఎలా నొక్కేయ్యాలా అని అలోచించేవాళ్లు వున్న ఈ రోజుల్లో.. ఏకంగా పది లక్షల రూపాయలు లభించినా.. దానిని తీసుకెళ్లి వారికి అప్పగించిన అటో డ్రైవర్ నిజాయితీ నిజంగా ప్రశంసనీయం..
వివరాల్లోకి వెళ్తే.. సిద్దిపేటకు చెందిన కొత్తూరు కృష్ణ, ప్రసాద్ అన్నదమ్ములు వారు హైదరాబాద్ గచ్చిబౌలీలోని శ్రీరామ్ నగర్ కాలనీ ఓ ఫ్లాట్ కొనుగోలు చేయాలని భావించారు. అందులో భాగంగా ఇవాళ ఫ్లాట్ బిల్డర్ కు పది లక్షల రూపాయాలను అడ్వాన్స్ గా చెల్లించాలని బ్యాంక్ నుంచి రూ.10 లక్షలు విత్ డ్రా చేసుకుని ఆటోలో వస్తున్నారు. అయితే ఆ సమయంలో కంగారులో డబ్బు ఉన్న బ్యాగును ఆటోలోనే మరచిపోయారు.
కొద్దిసేపటి తర్వాత బ్యాగును గుర్తించిన ఆటో డ్రైవర్ జార్పుల రమేశ్ అందులో రూ.10 లక్షల డబ్బు ఉండటాన్ని గమనించాడు. ఎంతోమంది తన ఆటో ఎక్కుతారు కాబట్టి .. మరచిపోయిన వారు ఎవరో గుర్తించలేకపోయారు. వెంటనే దగ్గర్లో ఉన్న పోలీస్ స్టేషన్కు వెళ్లి బ్యాగును అప్పగించారు. అయితే అప్పటికే కృష్ణ, ప్రసాద్ సోదరులు మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో వారి సమక్షంలోనే పోలీసులు బ్యాగును వారికి అప్పగించారు. నిజాయితీతో బ్యాగును అప్పగించిన ఆటోడ్రైవర్ను పోలీస్ అధికారులు ప్రశంసించారు.
(And get your daily news straight to your inbox)
Apr 03 | ఉత్తరప్రదేశ్ లో జరగనున్న పంచాయతీ ఎన్నికలు ఈసారి గ్లామరెస్ గా మారనున్నాయి. తాను పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు ఫెమినా మిస్ ఇండియా -2015 రన్నరప్ దీక్షాసింగ్ ప్రకటించింది. జౌన్ పూర్ జిల్లా బక్షా... Read more
Apr 03 | ఎనబై ఏళ్లకు పైబడిన వయస్సులోనూ అమె తన జీవనం కోసం అలోచించకుండా పది మంది కడుపు నింపే పనికి పూనుకున్నారు. అందరూ తన బిడ్డల లాంటి వారేనని, అమె అందరికీ అందుబాటు ధరలోనే ఇడ్లీలు... Read more
Apr 03 | బెంగళూరు డ్రగ్స్ కేసు..శాండిల్ వుడ్ పరిశ్రమను షేక్ చేసి అక్కడి ప్రముఖులను ఊచలు లెక్కపెట్టించిన కేసుకు సంబంధించిన లింకులు తెలంగాణలోనూ బయటపడ్డాయి. ఆ మధ్య పలువురు నటుల చు్ట్టూ తిరిగిన ఈ కేసులో వారి... Read more
Apr 03 | అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్న అసోంలో బీజేపీకి దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. అసోం బీజేపి ప్రతినిధిగా ముఖ్యమంత్రి సోనూవాల్ ను అధిగమించి మరీ దూసుకుపోతున్న రాష్ట్ర మంత్రి హిమంత విశ్వశర్మపై చర్యలు తీసుకున్నఎన్నికల కమీషన్... Read more
Apr 03 | తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం అంకానికి మరికొన్ని గంటల వ్యవధిలో తెరపడుతుందన్న తరుణంలో రాజకీయ పార్టీల మధ్య విమర్శలు ప్రతివిమర్శలు, అరోపణలు ఊపందుకుంటున్నాయి. మరీముఖ్యంగా బీజేపిని టార్గెట్ చేస్తున్న ప్రతిపక్ష పార్టీ డీఎంకే అధినేత... Read more