ఆంధ్రప్రదేశ్ పర్యటనలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చేసిన విమర్శలు, అరోపణలపై టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా స్పందించారు. అయితే ఆ పార్టీ కాకపోయినా.. అంతకుమించిన స్థాయిలో ధీటుగా స్పందించారు కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు విజయశాంతి. టీడీపీ నాలుగేళ్ల తమతో సక్యంగా కొనసాగి రాష్ట్రానికి అన్ని వనరులు సమకూర్చిన తరువాత.. సరిగ్గా ఎన్నికల సమయంలో ఆయన తమ నుంచి దూరమయ్యారని అమిత్ షా విమర్శల నేపథ్యంలో విజయశాంతి ధీటుగా స్పందించారు.
బీజేపిలో ప్రస్తుతం కేవలం ప్రధాని మోదీ నామజపం లేదంటే అమిత్ షా ఆధిపత్యం కనబడుతొందని విజయశాంతి విమర్శించారు. ఏబీ వాజ్ ఫాయ్, అద్వానీల హాయంలో పార్టీకి ప్రాధాన్యత లభించిందని, కానీ ఇప్పడు వ్యక్తులకే ప్రాథాన్యత లభిస్తోందని అన్నారు. ప్రస్తుతం బీజేపిలో ఓ వ్యక్తి చుట్టూ ఆ పార్టీ తిరుగుతుండడం వల్లే పార్టీకి సీనియర్లు దూరమవుతున్నారని విజయశాంతి విమర్శించారు. కూటమిలోని మిత్ర పక్షాలను బీజేపీ లెక్కచేయడం లేదని, వాటి అవసరం లేకుండా బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా కలలు కంటున్నారని విజయశాంతి ఎద్దేవా చేశారు.
వచ్చే ఎన్నికలు మోదీకి, ప్రతిపక్షాలకు మధ్య జరుగుతాయని ఆయన చెప్పడమే అందుకు నిదర్శనమన్నారు. ఇలా ఓ వ్యక్తి చుట్టూ బీజేపీ తిరగడం వల్ల, మోదీ ఆధిపత్య ధోరణి వల్లే సీనియర్ నేతలు ఆ పార్టీకి రాం రాం చెబుతున్నారని విమర్శించారు. ఎన్డీఏ నుంచి చంద్రబాబు తప్పుకోవడానికి కూడా కారణం అదేనని ట్విట్టర్ ద్వారా విజయశాంతి పేర్కొన్నారు. ఇంత జరుగుతున్నా పార్టీలో ఇంకా మోదీ భజనే జరుగుతుండడం ఆయన నిరంకుశత్వానికి అద్దం పడుతోందని విజయశాంతి ఘాటు వ్యాఖ్యలు చేశారు. అమిత్ షా ప్రకటనపై శివసేన ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందేనని కాంగ్రెస్ నేత పేర్కొన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more