2014 ఎన్నికలకు ముందు మధ్యతరగతి వర్గాలకు, వేతన జీవులకు ఇచ్చిన హామీని ఎట్టకేలకు ప్రభుత్వం మరోమారు ఎన్నికలకు వెళ్తున్న క్రమంలో నిలబెట్టుకున్నారు ప్రధాన మంత్రి నరేంద్రమోడీ. వేతన జీవులు గత ఐదేళ్లుగా ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూసిన ఆదాయ పన్ను మిహనాయింపు స్లాబ్ ను కేంద్రం తాజాగా ప్రవెశపెట్టిన ఇంటరమ్ బడ్జెట్ లో పేర్కొంది. అదాయపన్ను స్లాబ్ విధివిధానలను, సిఫార్సులపై తమ రెండో నివేదికను కూడా బీజేపి ప్రభుత్వం నియమించిన కమిటీ 2016లోనే సమర్పించినా.. 2019లో మాత్రమే దీనికి మోక్షం కల్పించింది కేంద్రం.
తాజాగా కేంద్రం అర్థికశాఖ మంత్రి పీయూష్ గోయల్ పార్లమెంటులోని తన బడ్జెట్ ప్రసంగంలో అదాయపన్నులో పరిమితిలో సవరణలు చేశామని చెబుతూ మధ్య తరగతి, వేతన జీవులకు భారీ ఊరట కల్పించారు. ఇప్పటివరకు రూ.2.5 లక్షలుగా వున్న ఆదాయ పన్ను మినహాయింపు ఇకపై రూ.5 లక్షలకు పెంచారు. దీంతో వార్షిక ఆదాయం రూ.5లక్షల వరకూ ఉన్న వారు ఇకపై ఆదాయపు పన్ను చెల్లించనవసరం లేదు.
దీనివల్ల 3 కోట్ల మంది మధ్యతరగతి వారికి ఊరట కలుగుతుందని గోయల్ తెలిపారు. ఉద్యోగులు, సిబ్బందికి ఈ నిర్ణయం వల్ల రూ.18,500 కోట్ల లబ్ధి చేకూరుతుందన్నారు. కాగా మధ్యతరగతి ఉద్యోగులకు భారీ ఊరట ప్రకటించిన నేపథ్యంలో పార్లమెంటులో బీజేపీ సభ్యులు మోదీ.. మోదీ.. మోదీ అంటూ నినాదాలతో, బల్లలు చరుస్తూ హోరెత్తించారు. దీంతో ప్రధాని చిరునవ్వులు చిందించారు.
రూ.ఐదు లక్షల వరకు పన్ను మినహాయింపుతో ఇకపై ఆరున్నర లక్షల రూపాయల అదాయం వున్నవారికి కూడా ఊరట ప్రకటించారు. రూ.6.5లక్షల ఆదాయం ఉన్న వారు జీవిత బీమా, పెన్షన్ ఫండ్ లలో పెట్టుబడులు పెట్టడం ద్వారా రాయితీతో అదాయ పన్ను నుంచి విముక్తులు కానున్నారు. ఇక దీంతో పాటుగా స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి రూ.40వేల నుంచి రూ.50వేలకు పెంచారు. పోస్టల్, బ్యాంకు డిపాజిట్లపై టీడీఎస్ పరిమితి పెంపు. అలాగే, టీడీఎస్ పరిమితి రూ.10వేల నుంచి రూ.40వేలకు పెంపు.
దీంతో పాటు అద్దెల రూపేణా అదాయం వచ్చే వారికి కూడా మినహాయింపు కల్పించారు. భారతీయ సినిమాల నిర్మాణం అనుమతి కోసం సింగిల్ విండో విధానం తీసుకురానున్నాం. జీఎస్టీ విధానంతో ఉత్పత్తిదారులు, వినియోగదారులకు ప్రయోజనం చేకూరింది. ఇంటి అద్దెలపై వచ్చే అదాయంలో టీడీఎస్ రూ. లక్షా 80 వేల రూపాయల నుంచి రెండు లక్షల 40 వేలకు పెంచారు. ఈ సందర్భంగా పీయూష్ గోయల్ తమ అభిమతాన్ని చాటుకున్నారు. ఇది కేవలం మధ్యంతర బడ్జెట్ మాత్రమే కాదు. దేశ ప్రగతికి మార్పునకు వాహనంలాంటిది. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి అనేది ప్రజా ఉద్యమంగా సాగుతోంది.
* బ్యాంకుల రుణాలు రూ. 35,984 కోట్లకు పెరుగుదల.
* కిసాన్ క్రెడిట్ కార్డులపై 2 శాతం వడ్డీ రాయితీ.
* ఉజ్వల యోజన కింద 8 కోట్ల ఉచిత వంటగ్యాస్ కనెక్షన్లు.
* ముద్ర యోజనలో రూ. 7.23 లక్షల కోట్ల రుణాలు.
* కార్మికుల ప్రమాద బీమా రూ. 1.50 లక్షల నుంచి రూ. 6 లక్షలకు పెంపు.
* 60 ఏళ్లు దాటిన కార్మికులంతా పెన్షన్ స్కీమ్ లో భాగస్తులే.
* కొత్తగా 10 కోట్ల మంది వృద్ధులకు లబ్ధి.
* పశు సంవర్థక, మత్స్య పరిశ్రమలకు 2 శాతం వడ్డీ రాయితీ.
* ప్రధానమంత్రి కౌశల్ యూజన ద్వారా కోటి మంది యువతకు లబ్ది.
* త్వరలోనే 'వందే భారత్' ఎక్స్ ప్రెస్ రైలు పరుగులు.
* రైల్వేలకు బడ్జెటరీ సపోర్ట్ కింద రూ. 64,587 కోట్లు.
* మిజోరం, మేఘాలయా రాష్ట్రాలను రైల్వేతో అనుసంధానం.
* ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి రూ. 15,166 కోట్ల కేటాయింపు.
* గడచిన ఐదేళ్లలో సౌర విద్యుత్ ఉత్పత్తి 10 రెట్లు పెరిగింది.
* గడచిన ఐదేళ్లలో 34 కోట్ల జన్ ధన్ అకౌంట్ల ప్రారంభం.
* ప్రత్యక్ష పన్నుల ద్వారా ఆదాయం రూ. 12 లక్షల కోట్లు.
* 80 శాతం పెరిగిన పన్ను చెల్లింపుదారుల సంఖ్య.
* సినిమా పరిశ్రమ 12 శాతం జీఎస్టీ పరిధిలోకి.
* సినిమా షూటింగ్ అనుమతులకు సింగిల్ విండో విధానం.
* రోజుకు 27 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం.
* 3 లక్షలకు పైగా బినామీ కంపెనీలను డీ రిజిస్టర్ చేశాం.
* వచ్చే ఐదేళ్లలో 5 ట్రిలియన్ డాలర్ ఎకానమీగా రూపాంతరం చెందుతుంది.
* 'ఈజ్ ఆఫ్ బిజినెస్' తో పాటే 'ఈజ్ ఆఫ్ లివింగ్'
* మరిన్ని విమానాశ్రయాలు రానున్నాయి.
* ఇన్ లాండ్ వాటర్ వేస్ కు పెద్దపీట.
* ఆర్థిక లావాదేవీలన్నీ డిజిటల్ మాధ్యమంగానే సాగేలా చర్యలు.
* ఎలక్ట్రిక్ వాహనాలకు మరిన్ని రాయితీలు.
* ట్రాన్స్ పోర్ట్ విప్లవంలో ప్రపంచానికే ఆదర్శంగా మారనున్న భారతావని.
* సరుకు రవాణా రంగంలోనూ ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రోత్సాహం.
* ప్రత్యామ్నాయ ఇంధన వనరులను ప్రోత్సహిస్తాం.
* గ్రామీణ ప్రాంతాల్లో పారిశ్రామికీకరణకు సమయం ఆసన్నమైంది.
* మేకిన్ ఇండియాలో భాగంగా గ్రామాలకు భారీ పరిశ్రమలను దగ్గర చేస్తాం.
* గంగానదిని కాలుష్య రహితంగా మార్చి చూపుతాం.
* ఇందుకోసం పంచసూత్ర ప్రణాళికను అమలు చేయనున్నాం.
* అంతరిక్ష కార్యక్రమాలకు మరిన్ని నిధులను కేటాయిస్తాం.
* ప్రపంచ దేశాల శాటిలైట్లను నింగిలోకి చేర్చడంలో మనమే ముందున్నాం.
* ఆహార ఉత్పత్తులను మరింత సేంధ్రీకరిస్తాం.
* పురుగు మందులు వాడని పంటతో మరింత ఆరోగ్యం.
* 2025 నాటికి ప్రతి దేశ పౌరుడికీ ఆరోగ్య బీమా ఉంటుంది.
* జాతీయ విద్యా మిషన్ కు రూ. 38,572 కోట్లు.
* చైల్డ్ డెవలప్ మెంట్ స్కీమ్ కు రూ. 27,584 కోట్లు.
* ఎస్సీ, ఎస్టీల అభ్యన్నతికి రూ. 76 వేల కోట్లు.
* నెలసరి పన్నుల వసూళ్లు మొత్తం రూ. 97,100 కోట్లు.
* కేంద్ర ప్రాయోజిత పథకాలకు రూ. 3.27 లక్షల కోట్లు.
* ప్రణాళికా వ్యయం రూ. 3.36 లక్షల కోట్లు.
* గత సంవత్సరంతో పోలిస్తే 13.3 శాతం పెరిగిన ప్రభుత్వ వ్యయం.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more