నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ప్రతీ ఏడాది నిర్వహించే నుమాయిష్ (ఎగ్జిబిషన్)లో జరిగిన అగ్ని ప్రమాదంలో తమ ఉత్ప్తుతులు నష్టపోయిన వారిని అదుకుంటామని ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. అగ్రి ప్రమాదంలో ఆస్తి నష్టపో్యిన వారితోపాటు ఎగ్జిబిషన్ కమిటీ కూడా తీవ్రంగా బాధపడుతోందని ఆయన అవేదన వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ జరగని ఇలాంటి ఘటనపై ఈటల అధ్యక్షతన పాలకవర్గ సమావేశమైంది.
ఈ సమావేశంలో అగ్నిప్రమాదానికి గల అసలు కారణాలు ఏంటి అన్న కోణంలో విశ్లేషించారు. దీంతోపాటు ఆస్తి నష్టం ఏ మేరకు జరిగిందన్న అంశంపై కూడా చర్చించారు. అనంతరం ఈటల మీడియాతో మాట్లాడారు. కశ్మీర్ నుంచి వ్యాపారులు ఏ ఆశతో వచ్చారో అదే ఆశతో వెళ్లేలా కృషి చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు. నుమాయిష్ ను మరో పక్షం రోజుల పాటు పొడగిస్తూన్నామని, ఈ పక్షం రోజల వ్యవధిలో వచ్చే అదాయానంతా బాధితులకు పంచుతామని ఆయన చెప్పారు.
అయితే ఇవాళ రేపు ఘటనలో పూర్తిగా ధగ్ధమైన స్టాలను పునర్నిర్మింపజేస్తామని చెప్పారు. దీంతో ఇవాళ రేపు నుమాయిష్ కు సెలవుప్రకటిస్తున్నామని చెప్పారు. కాగా, అగ్నిప్రమాద ఘటనపై సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు వివరాలను అడిగి తెలుసుకుంటున్నారని చెప్పారు. నలభై ఏళ్లుగా స్టాళ్ల నిర్వాహకులతో తాము కుటుంబంగా కలిసి పనిచేస్తున్నామన్నారు. ప్రమాదం దృష్ట్యా ఈరోజు, రేపు రెండు రోజులపాటు ఎగ్జిబిషన్ను నిలిపివేస్తున్నట్లు ఈటల ప్రకటించారు. స్టాళ్లను నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేయలేదని స్పష్టం చేశారు.
ఎగ్జిబిషన్ సొసైటీ ప్రైవేటు సంస్థ కాదని.. ఒక లక్ష్యం కోసం ఏర్పడిందన్నారు. వ్యాపారం కోసం కాకుండా ప్రజల కోసం పనిచేసే సంస్థగా ఈటల పేర్కొన్నారు. సొసైటీ ద్వారా వచ్చే లాభాలను పేద ప్రజలు, విద్యార్థుల కోసం వినియోగిస్తున్నట్లు చెప్పారు. స్టాళ్ల యాజమానులకు భోజనం ఇతర వసతులు కల్పిస్తున్నామన్నారు. అగ్ని ప్రమాద ఘటనపై సాయంత్రానికి నివేదిక వస్తుందని.. త్వరగా సహాయం చేస్తామని ఆయన వివరించారు. ఇక బాధిత స్టాళ్ల యజమానులకు వారి ఫీజును వెనక్కి ఇచ్చేస్తామని కూడా తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more