ముఖ్యమంత్రులు పాల్గోనే కార్యక్రమం అనగానే భద్రతా కారణాలు అన్ని అమల్లోకి వస్తాయి. అయితే ఇలాంటి సీఎం కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ఓ చిన్నారి విషయంలో ముఖ్యమంత్రి భద్రతా సిబ్బంది కనబర్చిన అత్యుత్సాహం, మితిమీరి ప్రవర్తన వివాదానికి దారితీసింది. అసోం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ బిశ్వనాథ్ జిల్లా బోర్గాంగ్ లో ఓ సిల్క్ మిల్లు నిర్మాణానికి శంకుస్థాపన చేయడానికి వచ్చారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు.
వీరిలో ఓ మహిళ తన మూడేళ్ల కుమారుడితో అక్కడకు చేరుకుంది. చల్లి తీవ్రంగా వున్నందున, అందులోనే అది శీతల ప్రాంత ప్రదేశం కావడంతో.. చిన్నారి నలుపు రంగు జాకెట్ వేయించి తీసుకువచ్చింది. అయితే అమెను సీఎం భద్రతా సిబ్బంది సోనోవాల్ కార్యక్రమానికి అనుమతించలేదు. ఆ చిన్నారి వేసుకున్న నలుపు రంగు జాకెట్ ను విప్పిన తర్వాతే పోలీసులు అమెను ముఖ్యమంత్రి కార్యాక్రమానికి అనుమతించారు.
ఆ చిన్నారి తల్లి అసహనానికి గురవుతూనే ఆ జాకెట్ విప్పారు. ఆ తర్వాత ఆ పిల్లాడు చలికి వణికిపోయాడు. ఈ తతంగాన్ని అక్కడున్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయింది. దీంతో విపక్షాలు విమర్శల వర్షం కురిపిస్తున్నాయి. అభంశుభం తెలియని మేడేళ్ల చిన్నారిని దైవంగా కొలిచే సంప్రదాయం మనది.. అలాంటి దేశంలో ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని విపక్షాలు మండిపడ్డాయి. ఈ ఘటనపై సీఎం సోనోవాల్ స్పందించారు. తక్షణమే విచారణ జరిపి వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని డీజీపీని ఆదేశించారు.
Assam CM Sarbananda Sonowal directs State DGP Kula Saikia to probe incident where a toddler was reportedly forced to open his black sweater at a function attended by the CM at Borgang in Biswanath today amid the spectre of black flag protests. pic.twitter.com/KtwmPCF8Fw
— Nandan Pratim Sharma Bordoloi
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more