గతేడాది డిసెంబర్ 7న జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తరువాత తాను వెల్లడించిన ఎగ్జిట్ పోల్ సర్వేలో మహాకూటమి పార్టీలు అధికారంలోకి వస్తాయని చెప్పిన ఒకే ఒక్కరు మాజీ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్. అయితే ఫలితాలు వెల్లడైన తరువాత అంతా తారుమైందని, నెట్ జనులు లగడపాటిని సోషల్ మీడియా వేదికగా ఆట ఆడుకున్నారు. ఈ క్రమంలో దాదాపుగా నలభై ఐదు రోజుల తరువాత ఏకంగా హస్తినలో మీడియా ముందుకు వచ్చిన లగడపాటి రాజగోపాల్ ఆయన తన వెలువరించిన సర్వే నివేదికలను తప్పబట్టాల్సిన అవసరం లేదని అన్నారు.
డిసెంబర్ 7న పోలింగ్ ముగిసిన తరువాత పొలింగ్ ఎంతమేరకు జరిగిందన్న విషయంలో ఎన్నికల అధికారులు ఎందుకంత ఆలస్యంగా రాష్ట్రంలోని ఓటింగ్ శాతాన్ని వెలువరించారో చెప్పాలని అర్థం కావడం లేదని అన్నారు. ఎలక్ట్రానిక్ యుగంలో ఓటింగ్ శాతాన్ని చెప్పడానికే ఈసీ అధికారులు తీసుకున్న సమయం.. ఎందుకంతగా పెరిగిపోయిందో చెప్పాల్సిన అవసరం వుందని అన్నారు.
ఇక తొలుత 67శాతం వున్న ఓటింగ్ శాతం తరువాత రోజుకు 73.2 కు వెళ్లిందని, ఎన్నికల సమయం ముగిసిన తరువాత దాదాపుగా 6.2శాతం ఓటింగ్ జరిగిందని, అయితే ఏయే గంటకు ఎంతమేరకు ఓటింగ్ జరిగిందో కూడా చెప్పాల్సిన బాధ్యత ఈసీ అధికారులపై వుందని లగడపాటి అన్నారు. ఈ విషయంలో ప్రజల్లో పలు అనుమానాలు వున్నాయని వాటిని నివృత్తి చేయాల్సిన అవసరం మాత్రం ఎన్నికల సంఘం అధికారులతో పాటు ప్రభుత్వాలపైనే వుందని అన్నారు.
కాగా, బీఎస్సీ పార్టీ తరపున ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో నిలిచిన మల్ రెడ్డి రంగారెడ్డి ఎన్నికల లెక్కింపులో అవకతవకలు జరిగాయని రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టును అశ్రయించగా, విచారణకు స్వీకరించిన న్యాయస్థానం ఈ నెల 30న సమగ్ర సమాచారంతో న్యాయస్థానంలో హాజరుకావాలని హైకోర్టు రాష్ట్ర ఎన్నికల అధికారులకు అదేశించింది. అయితే ఇవాళ కేసును న్యాయస్థానం వచ్చే నెల 7కు వాయిదా వేసింది.
ఇక మల్ రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంగా అతిపెద్ద దేశమైన భారత్ లో ప్రజాస్వామ్యాం మరింత పరఢవిల్లాలంటే.. ఎన్నికల కౌంటింగ్ ను వీవీ ప్యాట్ స్లిపులతోనే నిర్వహించాలని డిమాండ్ చేశారు. తన విషయంలో రెండు ఈవీఎం యంత్రాలకు.. వీవీ ప్యాట్ స్లిపులకు మధ్య 30 ఓట్ల వత్యాసం వచ్చిందని అలాంటిది మూడు నుంచి నాలుగు వందల ఈవీఎంలతో ఎంత వ్యత్యాసం వస్తుందో అర్థం చేసుకోవచ్చునని అన్నారు. ప్రజాధనంతో ఎన్నికలు నిర్వహిస్తున్న క్రమంలో ప్రజల ఓటుకు కూడా మరింత జవాబుదారి తనం కల్పించేందుకు వీవీప్యాట్ స్లిపులతోనే కౌంటింగ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more