తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి సెక్రటేరియట్ గా సేవలందించిన ట్యాంకుబండ్ పక్కనున్న సచివాలయం మరికొన్ని రోజుల్లో చరిత్రకు పరిమితం కానుంది. ఉమ్మడి రాష్ట్రంలో నిర్మించిన ఆ సచివాలయంలో వాస్తు దోషం వున్నదన్న నేపథ్యంలో మరో నూతన సచివాలయం నిర్మాణానికి నాంది పలికిన టీఆర్ఎస్ ప్రభుత్వానికి అడ్డంకులు ఒక్కొక్కటిగా తొలిగిపోతున్నాయి. వాస్తు దోషం మాట అటుంచితే.. తెలంగాణ రాష్ట్ర అవిర్భావ చరిత్రలో తనకంటూ ఓ పేజీని ఏర్పాటు చేసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ సచివాలయంతో మరో పేజీని కూడా రచించుకునేందుకు ఆటంకాలు తొలగిపోయాయి.
బైసన్ పోలో మైదానంలో సచివాలయ నిర్మాణానికి అనుమతి ఇవ్వొద్దంటూ దాఖలైన పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు తోసిపుచ్చింది. ఇది పూర్తిగా క్రీడా మైదానమని... ఇక్కడ ఎలాంటి నిర్మాణాలకు అనుమతి ఇవ్వొద్దంటూ కొందరు వేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. దీంతో బైసన్ పోలో గ్రౌండ్స్కు సంబంధించిన భూమిని తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించే విషయంలో కేంద్రానికి ఉన్న అడ్డంకులు తొలిగిపోయాయి.
మైదనం కన్న రాష్ట్రానికి సచివాలయం ముఖ్యమని అది అందరికీ అమోదయోగ్యమైన ప్రదేశంలో వుండటం సముచితమని భావించిన న్యాయస్థానం రాష్ట్ర ప్రభుత్వానికి సానుకూలంగా నిర్ణయం తీసుకుంటూ పిటీషన్ ను తోసిపుచ్చింది. దీంతో నూతన సచివాలయ నిర్మాణానికి వున్న అడ్డుంకుటు తొలగిపోయాయి. ఈ మైదానాన్ని తెలంగాణ ప్రభుత్వానికి అప్పగిస్తూ కొద్ది రోజుల్లోనే కేంద్రం నుంచి ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
బైసన్ పోలో గ్రౌండ్స్ కు సంబంధించిన 22 ఎకరాలతో పాటు జింఖానా మైదానానికి సంబంధించిన మరో 15 ఎకరాలను తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించేందుకు కేంద్రప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసినట్టు సమాచారం. అడ్డంకులు తొలిగిన నేపథ్యంలో సముహర్తాన్ని చూసి కేసీఆర్ ప్రభుత్వం ఈ మేరకు నిర్మాణాలను ప్రారంభించనుంది. కాగా, బైసన్ పోలో గ్రౌండ్స్లో కొత్త సచివాలయాన్ని నిర్మించాలని కొన్నేళ్ల క్రితమే నిర్ణయించిన తెలంగాణ ప్రభుత్వం... ఇందుకు సంబంధించి ప్లాన్ ను కూడా సిద్ధం చేసింది.
నిర్మాణ మొదలుపెట్టిన ఆరు నెలల్లోనే సచివాలయం నిర్మాణం పూర్తి చేసేలా ఏర్పాట్లు చేసింది. కొత్త సచివాలయంతో పాటు ఇదే ప్రాంగణంలో కళాభారతిని కూడా నిర్మించాలని తెలంగాణ సర్కారు నిర్ణయించింది. పాత కట్టడాల తరహాలో కొత్త సచివాలయ నిర్మాణం ఉండేలా డిజైన్ రూపొందించారు. మొదట్లో రూ. 175 కోట్లతో కొత్త సచివాలయం నిర్మాణం జరపాలని భావించిన ప్రభుత్వం... ఎంత ఖర్చయినా వెనకడాకుండా కొత్త సచివాలయం నిర్మాణాన్ని చేపట్టాలని నిర్ణయించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more