2017-18 ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా బ్యాంకుల్లో జరిగిన మోసాల విలువ ఎంత.? నోట్ల రద్దు తరువాత కొన్ని నెలల పాటు పుష్కలమైన నిధులతో కళకళలాడిన బ్యాంకులు ఆ తరువాత దివాళాతీసాయి. ఈ ఏడాది ఆరంభంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) లో వెలుగుచూసిన కుంభకోణం యావత్ బ్యాంకింగ్ రంగంలోనే సంచలనం సృష్టించింది. ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ, ఆయన బంధువు మెహుల్ ఛోక్సీ తదితరులు కలిసి పీఎన్బీకి రూ. 13వేల కోట్ల మేర కుచ్చుటోపి పెట్టారు.
మొత్తంగా బ్యాంకుల్లో కుంభకోణాలు జరిగిన మోసాల విలువ ఎంత తెలుసా..? అక్షరాలా రూ. 41,167.7కోట్లు. భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) తాజా గణాంకాలు వెల్లడించాయి. 2017-18 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకింగ్ వ్యవస్థలో మోసాలు 72శాతం పెరిగాయి. 2016-17 ఆర్థిక సంవత్సరంలో రూ. 23,933కోట్ల మేర బ్యాంకులు మోసపోగా.. గత ఆర్థిక సంవత్సరంలో ఈ మొత్తం రూ. 41,167.7కోట్లకు పెరిగింది.
పీఎన్బీ కుంభకోణం వల్లే మోసాలు విలువ అమాంతం పెరిగిందని ఆర్బీఐ గణాంకాలు పేర్కొన్నాయి. 2016-17 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకింగ్ రంగంలో 5,076 మోసం కేసులు నమోదవగా.. గత ఆర్థిక సంవత్సరంలో ఆ సంఖ్య 5,917కు పెరిగింది. కాగా.. మొత్తం నమోదైన మోసాల్లో 80శాతం రూ. 50కోట్లు అంతకంటే పైబడినవే. ఇక 93శాతం కేసుల్లో ప్రభుత్వ రంగ బ్యాంకులే మోసపోయినట్లు ఆర్బీఐ వెల్లడించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more