తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతుబంధు, రైతుబీమా పథకాలు దేశవ్యాప్తంగా మన్ననలు అందుకుంటున్న తరుణంలో ఈ పథకాలను తమ రాష్ట్రాల్లో కూడా అమలు పర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకోస్తున్నాయి. ఐక్యరాజ్యసమితి నుంచి ప్రశంసలు అందుకున్న ఈ పథకాలను అమలు చేస్తామని ఇప్పటికే ఒడిషా, జార్ఖండ్ రాష్ట్రాలు హామీని ఇచ్చాయి. కాగా, దేశానికి అన్నం పెట్టే రైతన్నల విషయంలో మరో అడుగు ముందుకేసీన పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం.. రైతుల కోసం మూడు పథకాలను ప్రవేశపెట్టనుంది.
తాజాగా తమ రాష్ట్రంలోనూ రైతుబంధు, రైతుబీమా తరహా పథకాలు అమలు చేస్తామని ప్రకటించిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరో అడుగు ముందుకేసీ పంటభీమా పథకాన్ని కూడా రైతులకు వర్తింపజేయనుంది. ఈ లాభం కూడా రైతులకు అందించనున్న ప్రభుత్వం.. అందుకయ్యే ప్రీమియం మొత్తాన్ని భరించనున్నట్లు మమతా బెనర్జీ సర్కార్ ప్రకటించింది.
పంట పెట్టుబడి సాయం కింద రైతులకు ఎకరానికి ఏడాదికి రూ. 5 వేల చొప్పున అందిస్తామని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు. దీంతో పాటు క్రాప్ ఇన్సూరెన్స్ పథకాన్ని ప్రకటించారు. ఎవరైనా రైతు మరణిస్తే.. అతడి కుటుంబానికి రూ. 2 లక్షల చొప్పున నష్ట పరిహారం అందజేస్తామని మమత తెలిపారు. ఈ ప్రీమియాన్ని మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందని ఆమె పేర్కొన్నారు.
W. Bengal CM: We’ve announced 2 programmes; first is for crop insurance where premium will be paid by state govt. In second we’ll give Rs 5000 per acre annually to farmers, also in case of death of a farmer b/w age of 18-60, compensation up to Rs 2lakh will be given to the family pic.twitter.com/s8CyMu0sck
— ANI (@ANI) December 31, 2018
18 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న రైతులందరకీ ఈ పథకాన్ని వర్తింపజేయనున్నట్లు ఆమె వెల్లడించారు. ఇప్పటికే ఒడిశా, జార్ఖండ్ రాష్ర్టాలు రైతుబంధు తరహా పథకాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ రెండు రాష్ర్టాల సరసన తాజాగా పశ్చిమ బెంగాల్ కూడా చేరింది. మరోవైపు.. మోదీ సర్కారు కూడా రైతు బీమా పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయడానికి కసరత్తు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
అన్నదాతకు అండగా నిలవాలనే సంకల్పంతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన రైతుబంధు పథకం దేశానికే దిక్సూచీలా మారింది. తెలంగాణలో ఈ పథకం కింద ఎకరానికి ఏడాదికి రూ. 8 వేల పెట్టుబడి సాయం ఇస్తున్నారు. ఈ మొత్తాన్ని రూ. 10 వేలకు పెంచారు. వచ్చే సీజన్ నుంచి రైతులకు రూ. 10 వేల పెట్టుబడి సాయం ఇస్తామని సీఎం కేసీఆర్ ఇటీవలి ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more