బీహార్ లో గతేడాది తాము సీజ్ చేసిన 9 లక్షల లీటర్ల మద్యాన్ని ఎలుకలు తాగిశాయని పోలీసులు చెప్పిన కథనాలు ఔరా.. అనిపించి ఆ వార్త దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తాజాగా, ఉత్తర్ప్రదేశ్ లో అలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఓ గ్యాంగ్ లా ఏర్పడిన ఎలుకలు దొరికిన మద్యాన్ని దొరికినట్టే తాగేస్తున్నాయట. ఈ విషయాన్ని స్వయంగా పోలీసులే వెల్లడించారు. ఈ తాగుబోతు ఎలుకల తీరు ఇప్పుడు ఏకంగా పోలీసుల మెడకు చుట్టుకుంది. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు దర్యాప్తునకు ఆదేశించడం గమనార్హం.
వివరాల్లోకి వెళితే... రాయబరేలీ ప్రాంతంలో ఇటీవల అక్రమ మద్యం భారీగా పట్టుబడింది. దీన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు, పోలీస్ స్టేషన్లోని ఓ గదిలో పెట్టి తాళం వేశారు. అయితే, బుధవారం ఈ మద్యం నిల్వలను పరిశీలించేందుకు పోలీస్ స్టేషన్ హెడ్ క్లర్క్ నరేశ్ పాల్ గది తలుపులు తెరిచాడు. అనంతరం, లోపలికి వెళ్లి చూడగా ఆ క్యాన్లలో చుక్క మద్యం కూడా లేకపోవడంతో ఆశ్చర్యపోయింది. ఖాళీగా కనిపిస్తోన్న ఆ క్యాన్లకు రంధ్రాలు ఉన్నాయి. ఆ గదిలో ఎలుకలు పరుగులు పెడుతుండడంతో ఇదంతా వాటి పనేనని పోలీసులు నిర్దరించారు.
మొత్తం 1,000 లీటర్ల మద్యాన్ని ఎలుకల గుంపు తాగేసిందని ఎస్పీ అభినందన్ సింగ్ తెలియజేశారు. ఆ ఎలుకలను తప్పకుండా పట్టుకుంటామని, భవిష్యత్తులో అవి స్టోర్ రూంలోకి ప్రవేశించకుండా అడ్డుకుంటామని ఎస్పీ పేర్కొన్నారు. అంతేకాదు, ఈ ఘటనపై విచారణకు ఆదేశించనున్నట్టు తెలిపారు. వాస్తవానికి స్వాధీనం చేసుకున్న మద్యం నమూనాలు, చట్టపరమైన ప్రొసీడింగ్స్ కోసం కొంత మొత్తంలో సేకరించి మిగతా దానిని ధ్వంసం చేయాలి. అలా కాకుండా మొత్తం 1,000 లీటర్ల మద్యాన్ని సీజ్చేసి పోలీస్ స్టేషన్లో దాచడం, తర్వాత దానిని ‘ఎలుకలు’ తాగేయడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి.
తాము స్వాధీనం చేసుకుని, గోడౌన్లలో భద్రపరిచిన 9 లక్షల లీటర్ల మద్యాన్ని ఎలుకలు తాగేశాయని బీహార్ పోలీసులు గతేడాది ప్రకటించారు. మద్యం నిల్వచేసిన క్యాన్లను ఎలుకలు ధ్వంసంచేసి తాగేశాయన్నారు. కానీ, ఈ వ్యవహారంలో అనుమానం వ్యక్తం చేస్తూ కొంతమంది పోలీసులకు బ్రీత్ ఎనలైజర్ పరీక్షలు కూడా నిర్వహించారు. గర్బంతో ఉన్నప్పుడు ఎలుకలు మద్యం తాగితే, వాటికి పుట్టే పిల్లలు తాగుబోతుగా మారుతాయని శాస్త్రీయంగా నిరూపితమైంది. పరిశోధకులు వీటికి నీరు, మద్యం అందజేస్తే అవి మద్యాన్నే తీసుకున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more