యోగా గురు రాందేవ్ కు చెందిన దివ్య ఫార్మసీ సంస్థకు ఉత్తరాఖండ్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. సదరు దివ్య ఫార్మసీ సంస్థ అర్జించిన లాభాలలో స్థానిక రైతులు మరియు రైతు సంఘాలతో లాభాలను పంచుకోవాలని ఆదేశించింది. బాబా రాందేవ్ ఫార్మసీ సంస్థ రైతుల నుంచి ఔషదతత్వాలు వున్న మొక్కలను తీసుకుని దానిని వ్యాపారంగా నిర్వహించిన లాభాలను అర్జించిన క్రమంలో న్యాయస్థానం ఈ మేరకు తీర్పును వెలువరించింది. బయోలాజికల్ డైవర్సిటీలో పొందుపర్చిన చట్టాల ప్రకారం ఈ మేరకు తీర్పును వెలువరించింది.
అయితే ఈ ప్రతిపాదన ఉత్తరాఖండ్ బయోడైవర్సిటీ బోర్డు నిబంధనలకు విరుద్ధమని బాబా రాందేవ్ ఆధ్వర్యంలో నడుస్తున్న దివ్య ఫార్మసీ కోర్టులో వాదించింది. బయోడైవర్సిటీ యాక్ట్ 2002 ప్రకారం కేవలం విదేశీ కంపెనీలు రైతుల నుంచి ఔషదీయ మొక్కలను కొనుగోలు చేస్తే మాత్రమే ఈ చట్టం వర్తిస్తుందని వాదనను వినిపించింది. అయితే బయోలాజికల్ డైవర్సిటీ చట్టరం ప్రకారం ఏదేని సంస్థ రైతుల నుంచి కొనుగోలు చేసే ఔషదీయ మొక్కలను వాణిజ్యపరంగా వాడినా చట్టం వర్తిస్తుందని ఉత్తరాఖండ్ కోర్టు స్పష్టం చేసింది.
ఆయుర్వేద ఉత్పత్తుల తయారీలో జీవ వనరులు ప్రధాన పదార్ధం మరియు ముడి పదార్ధాలను కలిగి ఉన్నాయని జస్టిస్ సుధాన్షు ధూలియా బెంచ్ స్పష్టం చేసింది. మొత్తం రూ. 421 కోట్ల కంపెనీ లాభంలో రెండు కోట్లను స్థానికులతో కలిసి పంచుకోవాలని ఆదేశించింది. గతంలోనే ఉత్తరాఖండ్ బయోడైవర్సిటీ బోర్డు ఇందుకు సంబంధించి ఆదేశాలు జారీ చేసింది. అయితే ఉత్తరాఖండ్ బయోడైవర్సిటీ బోర్డుకు ఇందుకు సంబంధించిన అధికారులు లేవని ఫార్మసీ కంపెనీ హైకోర్టును ఆశ్రయించింది.
ఈ అంశంలో అంతర్జాతీయ నిబంధనల ప్రకారం వ్యవహరించాలని హైకోర్టు తెలిపింది. ఉత్తరాఖండ్ బయోలాజికల్ బోర్డుకు ఈ అంశంపై ఆదేశాలు జారీ చేసే హక్కు ఉందని హైకోర్టు వెల్లడించింది. జీవ వనరులు దేశ సంపదతో పాటు ఆయా ప్రాంతాల్లో ఉండే వారి సంపద కూడా అని తెలిపింది. దీనిపై వారికి హక్కు ఉంటుందని తెలిపింది. హైకోర్టు తీర్పు తమకు అనుకూలంగా రావడంతో అయుర్వేద, ఔషదీయ మొక్కలు పెంచుతున్న రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఉత్పత్తులను స్థానిక వైద్యులతో పాటు హకీంలకు మాత్రం న్యాయస్థానం మినహాయింపు కల్పించింది
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more