గంటకు 180 కిలోమీటర్ల వేగంతో నడిచే ట్రైన్ 18 ఈ నెల 29వతేదీన అధికారికంగా తన సేవలను అందించనుంది. ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రధాని నరేంద్ర మోడీ ప్రాతినిథ్యం వహిస్తున్న సొంత నియోజకవర్గం వారణాసి నుంచి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీదుగా ఢిల్లీకి నడిపే ఈ రైలుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ 29న పచ్చజెండా ఊపి లాంఛనంగా ఈ రైలును ప్రారంభించనున్నారు. ఇంజన్ లేకుండా పూర్తిగా ఎయిర్ కండీషన్డ్ బోగీలతో చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో వందకోట్ల రూపాయల వ్యయంతో తయారైన ఈ రైలుకు ట్రైన్ 18 గా నామకరణం చేశారు.
అత్యంత వేగంగా నడిచే ఈ రైలు నుంచి ప్రయాణికులు సులభంగా దిగేందుకు వీలుగా తలుపుల వద్ద సైడ్స్ కూడా ఏర్పాటు చేశారు. వైఫైతోపాటు జీపీఎస్ బేస్డ్ ప్యాసింజర్ ఇన్ ఫర్ మేషన్ సిస్టమ్, టచ్ ఫ్రీ బయో వాక్యూమ్ టాయ్ లెట్స్, ఎల్ఈడీ లైట్లు, మొబైల్ చార్జింగ్ పాయింట్లు, ఉష్ణోగ్రతను నిరోధించే సిస్టమ్ ఈ రైలు ప్రత్యేకతలు. ఈ రైలులో రెండు ఎగ్జిక్యూటివ్ బోగీల్లో 52 సీట్లు ఏర్పాటు చేశారు. దేశంలోనే అత్యంత వేగంగా నడిచే రైలుగా దీనికి గుర్తింపు లభించనుందని రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు.
ఈ మేరకు రైలు ట్రయల్ రన్ సందర్భంగా తీసిన వీడియోను ట్విట్టర్ లో షేర్ చేశారు. ‘‘నీడ్ ఫర్ స్పీడ్’’ అంటూ ట్వీట్ చేసిన మంత్రి.. ట్రైన్-18 గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినట్టు పేర్కొన్నారు. దేశంలోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనన్నారు. దేశీయంగా అభివృద్ధి చేసిన ఈ ఇంజిన్ లేని రైలులో 16 ఏసీ కోచ్లు ఉంటాయి. ఇప్పటి వరకు ఫాస్టెస్ట్ రైళ్లగా రికార్డులకెక్కిన శతాబ్ది ఎక్స్ప్రెస్ వేగాన్ని ఇది అధిగమించనుంది. శతాబ్ది ఎక్స్ప్రెస్ రైలు వేగం గంటకు 155 కిలోమీటర్లు. ఈ రైలుతో పోలిస్తే ప్రయాణ వేగాన్ని 15 శాతం తగ్గిస్తుంది. న్యూఢిల్లీ-వారణాసి, హబీబ్గంజ్-న్యూఢిల్లీ, లక్నో-న్యూఢిల్లీ, న్యూఢిల్లీ-కల్కా, న్యూఢిల్లీ-అమృత్సర్, అహ్మదాబాద్-ముంబై రూట్లలో ఈ రైలు ప్రయాణించనుంది.
Need for Speed: Train 18 seen cruising at a sustained 180Km/h, officially becoming the fastest train in India pic.twitter.com/2VNF1U3qrl
— Piyush Goyal (@PiyushGoyal) December 26, 2018
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more