ఇండోనేసియాలో అకస్మాత్తుగా వచ్చిన సునామీ మృతుల సంఖ్య సోమవారం నాటికి 281కి పెరిగింది. జావా, సుమత్ర దీవుల్లో సంభవించిన సునామీ కారణంగా ఇప్పటికీ 57 మంది గల్లంతుకాగా, 1016 మంది క్షతగాత్రులయ్యారు. చడీచప్పుడు లేకుండా ఎలాంటి భూ ప్రకంపనలు లేకుండా నిషద్దంగా వచ్చిన సునామి.. ఒక్కసారిగా పంజా విసరడంతో సముద్రంలో రాకాసీ అలలు ఎగసిపడి.. అల్లకల్లోలం సృషటించిన విషయం తెలిసిందే.
క్రాకటోవా ‘శిశువు’గా పిల్చుకునే ఓ అగ్నిపర్వతం శనివారం రాత్రి 9 గంటల సమయంలో బద్దలైంది. సరిగ్గా 24 నిమిషాల తర్వాత నీటి లోపల భూమి కంపించి సునామీ సంభవించింది. సుమత్రా దీవి దక్షిణ తీరాన్ని, జావా పశ్చిమ ప్రాంతాన్ని రాకాసి అలలు ముంచెత్తాయి. సునామీ ధాటికి తొలుగ 48 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు ప్రకటించినా.. ఆదివారానికి ఆ సంఖ్య 168కి, సోమవారానికి 281కి చేరింది. వేయి మందికి పైగా ప్రజలు గాయపడ్డారు. సునామీ ధాటికి బీచ్లు క్షణాల్లో బీచ్లు మృత్యుదిబ్బలుగా మారాయి. వేల చెట్లను సునామీ కూకటివేళ్లతో సహా పెకిలించింది.
సరిగ్గా క్రిస్ట్మస్ ముందు వీకెండ్ కావడంలో సముద్రతీరంలోని హోట్లళ్లు, రిసార్టులు కిక్కిరిసిపోయాయి. ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణలతో జావా, సుమత్రా దీపుల ప్రాంతాలు జనసంధ్రమయ్యాయి. అదే సమయంలో ఎలాంటి హెచ్చరికలు లేకుండా వచ్చిన సునామీ ధాటికి అనేక మంది భయాందోళనకు గురై ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. వందలాంది మంది జలసమాధి అయ్యారు. సుందా జలసంధి దారుణంగా దెబ్బతింది.
వందలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. దీంతో వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ప్రాణ, ఆస్తి నష్టం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. జావా ద్వీపంలోని పండెగ్లాంగ్లో ప్రస్తుతం ఎక్కడ చూసినా కలపతో కూడిన చెత్త పేరుకుపోయి ఉంది. ఇళ్లు ధ్వంసమయ్యాయి. కార్లు ఒకదానిపైకి ఒకటి ఎక్కి కూర్చున్నాయి. కూలిపోయిన ఇళ్లు, కలప మధ్య ఎవరైనా చిక్కుకున్నారేమో అని రెస్క్యూ టీమ్లు అన్వేషిస్తున్నాయి.
ఇండోనేసియాకు సునామీలు, భూకంపాలు కొత్తేమీ కాదు. 2004 డిసెంబర్ 26న హిందూ మహాసముద్రంలో సంభవించిన సునామీ కారణంగా 13 దేశాల్లో రెండు లక్షల 26వేల మంది చనిపోయారు. వీరిలో కేవలం ఇండోనేసియా నుంచే ఒక లక్షా 20వేల మంది ఉండటం గమనార్హం. ఇక క్రకటోవా అగ్నిపర్వతం వల్ల సంభవించిన సునామీల కారణంగా ఇండోనేసియాలో 1883లో 36వేలకు పైగా ప్రాణాలు కోల్పోయారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more