పెళ్లంటే పందిళ్లు, తప్పట్లు తాళాలు.. మూడే ముళ్లు, ఏడే అడుగులు మొత్తం కలిపి నూరేళ్లు అంటూ హామీ ఇచ్చిన భర్త.. పెళ్లంటే మున్నాళ్ల ముచ్చటే అని పెద్దల సమక్షంలో చేసిన ప్రమాణాన్ని తుంగలో తొక్కాడు. మూడేళ్లకే ‘నువ్వంటే ఇష్టం లేదు’ అని వదిలించుకునే ప్రయత్నాలు చేశాడు. దేశం కాని దేశానికి వెళ్లిన భర్త అక్కడి నుంచే ఫోన్ ద్వారా విడాకులు ఇచ్చాడు. అయితే అది చెల్లుబాటు కాదని, తన కాపురాన్ని కాపాడుకునే ప్రయత్నాలు చేసిన బాధితురాలు సఫలీకృతురాలు అయ్యింది.
దీంతో తాను ఇంతలా చెప్పినా.. తన భార్య మాత్రం విడాకులకు సిద్దం కావడం లేదన్న అక్కస్సుతో సభ్యసమాజం తలదించుకునే విధంగా వ్యవహరించాడు ఆ భర్త. తన భార్య పరువును తీశాడు. గతంలో సన్నిహితంగా ఉన్నప్పుడు తీసుకున్న నగ్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అసభ్యకరమైన కామెంట్లు కూడా జోడించాడు. ఈ ఘటన గుజరాత్ లోని అహ్మాదాబాద్ లో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. గుజరాత్ కు చెందిన ఓ యువతికి 2015లో స్థానికంగా వుండే యువకుడితో వివాహం అయింది. పెళ్లైన తరువాత యువకుడికి బాగా కలసి వచ్చింది. అంతే అస్ట్రేలియాలో ఉద్యోగం రావడంతో.. ఎగిరిపోయాడు. అయితే ఎగిరిపోయే ముందు తన కొత్తగా జోడి కుదిరిన వీరు కాపురంలో కలహాలు తిష్టవేశాయి. ఈ క్రమంలో ఆస్ట్రేలియాకు వెళ్లిన భర్త.. అక్కడ నుంచే ఫోన్ లోనే బాధితురాలికి విడాకులు ఇస్తున్నట్లు తెలిపాడు. దీంతో దిగ్భ్రాంతికి లోనైన యువతి న్యాయపోరాటానికి దిగింది.
అయితే భార్యను ఎలాగైనా వదిలించుకోవాలని భావించిన సదరు యువకుడు గతంలో తామిద్దరూ సన్నిహితంగా ఉన్న సమయంలో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. వీటికి అభ్యంతకరమైన, అశ్లీల కామెంట్లను జోడించాడు. వీటిని గమనించిన యువతి వెంటనే అహ్మదాబాద్ సైబర్ సెల్ పోలీసులను ఆశ్రయించింది. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more