తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం మరికోన్ని గంటల వ్యవధిలో ముగుస్తున్న నేపథ్యంలో తన ప్రీఫోల్ సర్వే వివరాలను వెల్లడించారు మాజీ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్. తెలంగాణలో ప్రస్తుతం ప్రజానాడీ కాంగ్రెస్ పార్టీ వైపు ఉందని వెల్లడించారు. అయితే ఇది గత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ శాతం రానున్న ఎన్నికలలో నమోదయితే మాత్రమే సాధ్యమని చెప్పారు. అలా కాకుండా ఓటింగ్ శాతం పెరిగితే మహాకూటమి ప్రభుత్వ ఏర్పాటు సాధ్యమని, ఓటింగ్ శాతం తగ్గితే రాష్ట్రంలో హంగ్ ఏర్పడే అవకాశలుంటాయని అన్నారు.
ఇక విభజన తర్వాత ప్రజల మధ్య ఎలాంటి రాగద్వేషాలు లేకుండా భిన్నత్వంలో ఏకత్వంతో మెలుగుతున్నారని అన్నారు. ఇక జిల్లాల వారీగా పార్టీల బలాబలాలను కూడా ఆయన తెలిపారు. ఖమ్మం, నల్గొండ, ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉంటుందని, వరంగల్, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో టీఆర్ఎస్ కు ఆధిక్యత లభిస్తుందని, కరీంనగర్, మహబూబ్ నగర్ జిల్లాల్లో మాత్రం పోటాపోటీ ఉంటుందని లగడపాటి అభిప్రాయపడ్డారు.
ఇక రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో ఎక్కువ స్థానాల్లో ఎంఐఎంకు, ఆ తర్వాత బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు గెలుస్తాయని లగడపాటి తన సర్వేలో పాక్షిక వివరాలను వెల్లడించారు. ఇదిలా వుండగా, ఈ ఎన్నికలలో స్వతంత్రులుగా బరిలో దిగిన రెబెల్స్ గెలుస్తారని వారిలో నారాయణ్ పేట్ నుంచి శివకుమార్ రెడ్డి, భోద్ నుంచి అనీల్ జాదవ్ పేర్లను ఇప్పటికే ప్రకటించిన ఆయన ఇక తాజాగా ఇబ్రహీంపట్నం నుంచి బీఎస్సీ అభ్యర్థి మల్ రెడ్డి రంగారెడ్డి గెలుపోందే అవకాశాలున్నాయిని అన్నారు.
ఇక మహాబూబ్ నగర్ జిల్లాలోని మక్తల్ నుంచి జలందర్ రెడ్డి.. అదిలాబాద్ జిల్లాలోని బెల్లంపల్లి నుంచి జి.వినోద్ గెలుపోందుతారని చెప్పారు. ఇక మరో మూడు స్థానాల్లో కూడా స్వతంత్రులు గెలుపొందనున్నారని, అయితే ఆ స్థానాల వివరాలు తెలపడానికి.. ఆయా స్థానాల నుంచి బరిలోవున్న తన స్నేహితులు అడ్డుపడుతున్నారని అన్నారు. అయితే బుధవారం సాయంత్రం వరకు సమయం వున్నందున ఈ లోపు మిగతా ముగ్గురి వివరాలను తెలియజేస్తానని తెలిపారు.
ఇక రాష్ట్రంలో బీజేపి జిల్లాలకు కూడా విస్తరిస్తుందని చెప్పిన ఆయన గతం కంటే ఈ సారి వారి సంఖ్య పెరిగే అవకాశాలున్నాయని తెలిపారు. తెలంగాణలోని మొత్తం 119 నియోజకవర్గాలకు గాను వంద నియోజకవర్గాల్లో సర్వే నిర్వహించామని ఆయన తెలిపారు, ఒక్కో నియోజకవర్గంలో 1000 నుంచి 1200 నమూనాలు తీసుకున్నామని, అన్ని సామాజిక వర్గాల నుంచి అభిప్రాయాలను సేకరించామని చెప్పారు. ప్రస్తుతం తనకు ఏ పార్టీతోనూ, ఎవరితోనూ సంబంధం లేదని, 2009, 2014 ఎన్నికల్లో తాను చెప్పింది నిజమైందని అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more