తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గెలుపుపై అన్ని పార్టీలు ధీమా వ్యక్తం చేస్తూ ఎన్నికల బరిలో నిలిచాయి. ఈ లోగా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ముమ్మర ప్రచారం కూడా నిర్వహిస్తున్నాయి. మరో అరడజను రోజు వ్యవధిలో రానున్న ఎన్నికలలో ప్రతీక్షణం అత్యంత విలువైనదేనని అభ్యర్థుల అనేక వ్యవప్రయాసలకు ఓర్చి మరీ శ్రమిస్తున్నారు. అయితే ఈ క్రమంలో అధికార టీఆర్ఎస్ పార్టీ, మహాకూటమి మధ్య పోటీ తీవ్రంగానే వున్నా.. నగరంలో మాత్రం ఎంఐఎం. బీజేపి పార్టీలు క్రీయాశీలకంగా మారనున్నాయి.
అయితే డిసెంబర్ 7న జరగనున్న ఎన్నికలతో ఈవీఎం యంత్రాలలో ప్రజాతీర్పు నిక్షిప్తమై వుంటుంది. కాగా డిసెంబర్ 11న జరిగే ఓట్ల లెక్కింపు తరువాత తామే రాష్ట్రంలో కింగ్ మేకర్ గా తయారవుతామని ఎంఐఎం పార్టీ ఆగ్ర నేత అక్బరుద్దీన్ ఓవైసీ కలలు కంటున్నారు. ఔనా నిజమేనా అంటే ఇది ముమ్మాటికీ నిజమే. ఈ సారి ఎన్నికలలో గతం కంటే ఒకటి రెండు స్థానాలు అధికంగానే తమ ఖాతాలోకి వేసుకుంటామని ధీమాతో వున్నా ఆయన కర్ణాటక తరహా ఫలితాలు వస్తే పరిస్థితి తమకే అధికారం అందేలా కూడా వుంటుందని అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల సమయం దగ్గరపడడంతో ఎంఐఎం కూడా అందుకు తగ్గట్టుగా సిద్ధమవుతోంది. చంద్రాయణగుట్ట నియోయకవర్గంలోని రియసాత్ నగర్ లో ఎంఐఎం పార్టీ ఏర్పాటు చేసిన పబ్లిక్ మీటింగ్ లో ఓవైసీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి, రోశయ్య, కేసీఆర్ ప్రతి ఒక్క సీఎంకు చెపుతున్నా.. డిసెంబర్ 11న అందరూ చూడండి ఏంజరుగుతుందో, ఆ రోజున నేనే కింగ్ మేకర్ అని అన్నారు.
అంతకుముందు కూడా హైదరాబాద్లో జరిగిన ఎంఐఎం కార్యకర్తల సమావేశంలో అక్బరుద్దీన్ ఓవైసి ఉద్రేకంగా మాట్లాడారు. ఈసారి తెలంగాణ రాష్ట్రంలో ఎంఐఎం కీలక పాత్ర నిర్వహించే అవకాశం ఏర్పడుతుందన్నారు. రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు?. కర్ణాటకలో కుమారస్వామి ముఖ్యమంత్రి అయినపుడు.. తెలంగాణలో మేము (ఎంఐఎం) ఎందుకు సీఎం కాలేం? అని ఓవైసీ ప్రశ్నించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more