ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టు షాకిచ్చింది. ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్పై దాడి కేసును.. ప్రభుత్వ కుట్రగా పేర్కోంటూ వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను ఇవాళ ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా 8మందికి నోటీసులు జారీ చేసింది. తమ నోటీసులపై రెండు వారాల్లో వివరణ ఇవ్వాలని న్యాయస్థాన ధర్మాసనం ఆదేశించింది.
ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటూ ఆంధ్రప్రదేశ్ డీజీపీ, తెలంగాణ డీజీపీలకు కూడా హై్కోర్టు నోటీసులు జారీ చేసింది. అలాగే విశాఖ విమానాశ్రయంలో భద్రతా లోపాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ధర్మాసనం.. కేసుకు సంబంధించిన వివరాలను సీల్డ్ కవర్ లో అందించాలని సిట్ ను ఆదేశించింది. ఈ కేసును రెండు వారాలకు వాయిదా వేసింది. ప్రతిపక్ష నేత జగన్ పై అంధ్రప్రదేశ్ ప్రభుత్వమే కుట్రపూరితంగా వ్యవహరించి.. దర్యాప్తును కూడా తమ ఇష్టానుసారంగా చేయిస్తుందని పిటీషన్ లో వైవీ సుబ్బారెడ్డి పెర్కోన్నారని సమాచారం.
మరోవైపు దాడి కేసులో వైఎస్ జగన్ దాఖలు చేసిన పిటిషన్పై కూడా మంగళవారం విచారణ జరిగింది. సిట్ ఇన్చార్జ్గా ఉన్న ఏసీపీ బీవీఎస్ నాగేశ్వరరావు కేసు వివరాలను సీల్డ్కవర్లో కోర్టుకు అందజేశారు. అనంతరం ఈ పిటిషన్పై వాదనలు జరిగాయి. ఈ సందర్భంలో సీసీ టీవీ ఫుటేజ్ వివరాలను ఏమయ్యాయని ధర్మాసనం అధికారులను ప్రశ్నించింది. గత మూడు నెలలుగా సీసీ టీవీ ఫుటేజ్ లేదని అధికారులు తెలపడంతో ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. సీసీటీవీ పర్యవేక్షణ ఎవరి ఆధీనంలో ఉందనే విషయంపై సిట్ అధికారులు సమాధానం చెప్పలేకపోయారు. విశాఖ ఎయిర్పోర్ట్ భద్రతా లోపాలు క్షమించారానివని ధర్మాసనం అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more