2007 లో సంచలనం సృష్టించిన ఫార్మసి విద్యార్థి ఆయేషా మీరా అత్యాచారం, హత్య కేసు మళ్ళీ తెరపైకి వచ్చింది. విజయవాడ శివారు ఇబ్రహీంపట్నంలోని ఓ ప్రైవేటు హాస్టల్లో 2007 డిసెంబరులో ఆయేషామీరా హత్యాచారం చేయబడింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న సత్యంబాబును 2017 మార్చి 31న హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. కాగా, ఈ కేసులో అసలు దోషులు ఎవరు అన్న ప్రశ్న మాత్రం ఇప్పటికీ మిలియన్ డాలర్ల ప్రశ్నగానే వుంది. ఇక ఈ కేసులో కీలకమైన అధారాలన్నీ ఇప్పటికే మాయమయ్యాయి.
ఈ కేసులో అసలు దోషులు ఓ మాజీ మంత్రి కొడుకేనని అప్పట్లో వార్తలు వచ్చినా.. సత్యం బాబును అరెస్టు చేసి పదేళ్ల శిక్ష తరువాత ఆయనను నిర్దోషిగా రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టు ప్రకటించడంతో విడుదలయ్యాడు. దీంతో ఈ కేసులో అసలైన దోషులను శిక్షించాలని కోరుతూ హైకోర్టులో దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ చేపట్టింది. కాగా ఈ హత్యకేసుకు సంబంధించిన సాక్ష్యాధారాలను నాశనం చేశారని హైకోర్టు రిజిస్టర్ జనరల్ న్యాయస్థానానికి నివేదికలు అందజేశారు.
దీనిపై అగ్రహాన్ని వ్యక్తం చేసిన హైకోర్టు.. సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ హత్య కేసుకు సంబంధించిన సాక్ష్యాధారాలను నాశనం చేయడం వెనుక కింది కోర్టులోని న్యాయాధికారులతో సహా మరే ఇతర అధికారుల హస్తం ఉన్నా ఎవర్నీ వదలిపెట్టబోమని హైకోర్టు స్పష్టం చేసింది. హత్య కేసు ‘అప్పీల్’ పైకోర్టులో పెండింగ్లో ఉన్నప్పుడు సాక్ష్యాధారాలు నాశనం చేయడం ఏంటని మండిపడింది. అయితే రిజిస్ట్రార్ జనరల్ సమర్పించిన సీల్డు కవర్ లో సమర్పించిన నివేదికను పూర్తిగా అధ్యయనం చేసిన తరువాత ఈ కేసును సిబిఐ చేత పునర్విచారణకు అదేశిస్తామని హైకోర్టు తెలిపింది.
ఈ ప్రజాప్రయోజన వాజ్యాన్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీబీఎన్ రాధాకృష్ణన్, జస్టిస్ ఎస్వీ భట్ల ద్విసభ్య ధర్మాసనం విచారణ చేసి వాయిదా వేసింది. కాగా, సిట్ తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది కృష్ణ ప్రకాశ్ వాదనలు వినిపించారు. వస్తు సంబంధ సాక్ష్యాలు అందుబాటులోలేని కారణంగా ఈ కేసును సీబీఐ సైతం దర్యాప్తు ప్రారంభించడం కష్టంగా ఉంటుందని ఆయన తెలిపారు. అయితే, ఈ వాదనలను తోసిపుచ్చిన ధర్మాసనం.. ఇలాంటి సందర్భాల్లోనూ దర్యాప్తు ఎలా చేపట్టాలో సీబీఐకి తెలుసునని వ్యాఖ్యానించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more