వచ్చే నెల (డిసెంబర్) 7న జరగనున్న తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎక్కడా ఎలాంటి అక్రమాలు, అవకతవకలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్న తెలంగాణ ఎన్నికల అధికారులు.. అక్కడక్కడా అత్యుత్సాహం కూడా ప్రదర్శించి పార్టీ కార్యకర్తలు చేతుల్లో పరాభవాలను ఎదుర్కోంటున్నారు. మరోలా చెప్పాలంటే అధికార పార్టీకీ కొమ్ముకాస్తూ.. ప్రత్యర్థి పార్టీలను మాత్రం టార్గెట్ చేస్తున్నారని విమర్శలను ఎదుర్కోంటున్నారు. వరంగల్ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీకి వున్న పట్టు తప్పుతుందని భావించారో ఏమో తెలియదు కానీ అక్కడ ఎన్నికల సంఘం అధికారులు తమ పరిధి ధాటి వ్యవహరించారని కాంగ్రెస్ కార్యకర్తలు అరోపిస్తున్నారు.
వరంగల్ రూరల్ జిల్లాలో ఎన్నికల సంఘం అధికారులు హల్ చల్ చేశారు. ఏకంగా ప్రత్యర్థి పార్టీ కార్యాలయాన్ని వారు టార్గెట్ చేయడం అక్కడి కార్యకర్తల అగ్రహానికి గురయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని నర్సంపేట పట్టణంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి ఉదయాన్నే చేరుకున్న అధికారులు కార్యాలయం తాళాలను పగులగొట్టి తనిఖీలు నిర్వహించారు. అయితే పార్టీ కార్యకర్తలు, నేతలకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అధికారులు ఈ చర్యలకు పాల్పడ్డారు. అసలు కనీస సమాచారం ఇచ్చేందుకు కూడా ఎన్నికల సంఘం అధికారులు ఏమాత్రం ప్రయత్నించలేదు.
ఈ విషయం తెలుసుకున్న స్థానిక కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు కార్యాలయంపై దాడి చేసి తనిఖీలు చేస్తున్న అధికారులను వారు నిర్భంధించారు. ఇలా దూకుడుగా వ్యవహరించిన ఫ్లయింగ్ స్వ్కాడ్ చీఫ్ సతీశ్ కాంగ్రెస్ నేతలు తమ పార్టీ కార్యాలయంలోనే నిర్బంధించారు. అధికారులు తమకు సమాచారం ఇవ్వకుండా ఇలాంటి దాడుల పేరుతో వారే అక్రమాలకు పాల్పడి.. తమపై నెట్టే అవకాశం లేకపోలేదని కూడా కాంగ్రెస్ నేతలు అరోపించారు.
అధికార పార్టీ కుట్రలో భాగంగానే ఈ దాడి చోటుచేసుకుందని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి ప్రతీకార చర్యలు సరికాదని హెచ్చరించారు. అధికార టీఆర్ఎస్ నేతలే ఇందుకు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సంఘం అధికారుల తీరును నిరసిస్తూ నర్సంపేటలో కాంగ్రెస్ నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు. వారిపై తక్షణం చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more