PrajaKutami win is priority says Chandrababu ప్రజాకూటమి గెలుపే ముఖ్యం.. సీట్లు కాదు..

Prajakutami win is more priority than seats says chandrababu

chandrababu, TDP Party, L Ramana, Nama Nageswara rao, Kcr, telangana, congress, mahakutami, trs, bjp, telangana elections 2018, telangana assembly elections 2018, early elections, early polls, Andhra Pradesh, Telangana, politics

In Telangana Assembly Elections our motto is PrajaKutami win said TDP president and AP CM chandrababu in telangana tdp polit bureau meet. He said in this elections Alliance with Congress is important.

ప్రజాకూటమి గెలుపే ముఖ్యం.. తమ్ముళ్లకు చంద్రబాబు దిశానిర్దేశం..

Posted: 10/22/2018 07:08 PM IST
Prajakutami win is more priority than seats says chandrababu

ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణలో ప్రజా కూటమి గెలుపే తమకు అత్యంత ముఖ్యమని టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రానున్న ఎన్నికలలో టీడీపీకి సీట్ల కన్నా.. పొత్తు ముఖ్యమని అన్నారు. మనకు కాంగ్రెస్ 12 సీట్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని, మరో ఆరు సీట్లు అడుగుదామని చెప్పారు. సీట్ల కేటాయింపు విషయమై కాంగ్రెస్ పెద్దలతో తాను మాట్లాడుతానని చెప్పారు. ఆయన రాహుల్ గాంధీతో మాట్లాడే అవకాశాలు ఉంటాయని భావిస్తున్నారు.

టిక్కెట్ రాని వారు అసంతృప్తికి గురి కావొద్దని, కూటమి గెలుపు కోసం కష్టపడాలన్నారు. ప్రజాకూటమి అధికారంలోకి వస్తే అందరికీ న్యాయం చేస్తానని చెప్పారు. ప్రభుత్వ ఏర్పాటు తర్వాత ప్రత్యామ్నాయ పదవులు వస్తాయన్నారు. తెలంగాణలో ఏర్పడే కూటమి జాతీయస్థాయిలో ప్రభావం చూపుతుందని చెప్పారు. అందుకనే ఈ అసెంబ్లీ ఎన్నికలలో తమకు కాంగ్రెస్ పార్టీతో పొత్తు ముఖ్యమని, ఆ పార్టీతో మనం సర్దుకుపోవాలని చంద్రబాబు సూచించారు.

తెలంగాణ టీడీపీ నేతలతో, పొలిట్ బ్యూరో సభ్యులతో చంద్రబాబు భేటీ అయ్యారు. తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో పొత్తులు, సీట్ల సర్దుబాటుపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో ప్రజా కూటమి అధికారంలోకి రాబోతోందని చెప్పారు. మనకు పొత్తు ముఖ్యమని, సీట్లు కాదని, ఎక్కువగా ఆశలు పెట్టుకోవద్దని తెలుగు తమ్ముళ్లకు సూచించారు. మన పార్టీ బలంగా ఉన్న స్థానాల్లో మాత్రమే పోటీ చేద్దామని టీటీడీపీ నేతలతో చెప్పారు.

ప్రజాకూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేటెడ్ పోస్టుల్లో అవకాశం ఉంటుందని చంద్రబాబు తెలంగాణ టీడీపీ నేతలతో చెప్పారు. మహాకూటమిలో భాగంగా మనకు చాలా చోట్ల సీట్లు రావని, మనకు టిక్కెట్ రాలేదని, ఊరుకోవద్దని, మన కూటమి క్యాడర్ గెలుపు కోసం పని చేయాలని సూచించారు. కూటమి గెలుపు అంటే తెలంగాణలో కాంగ్రెస్‌దే అధికారం. ఇతర పార్టీలు ప్రభుత్వంలో ఉండే అవకాశం ఉంటుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chandrababu  TDP leaders  congress  prajakutami  TRS  KCR  Telangana  Politics  

Other Articles