తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని గొల్లప్రోలులో వెనుకనుంచి వేగంగా దూసుకువచ్చిన టిప్పర్ లారీ.. ఎదురుగా వెళ్తున్న టాటా ఏస్ వాహనాన్ని ఢీకొనింది. ఈ ఘటనలో టాటా ఏస్ వాహనంలో ప్రయాణిస్తున్న ఆరుగురు మహిళలు అక్కడికక్కడే మరణించగా.. మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను కాకినాడ జీజీహెచ్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ప్రమాదం జరిగినప్పుడు టాటా ఏస్ వాహనంలో డ్రైవర్తో కలిపి 15 మంది ఉన్నారని తెలుస్తుంది. కాగా, వారంతా విశాఖ జిల్లావాసులని సమాచారం. వీరంతా తమ బంధువుల ఇంట్లో జరిగిన ఓ శుభకార్యానికి హాజరై తిరుగు ప్రయాణంలో ఈ ఘటన సంభవించింది. వివరాల్లోకి వెళ్తే.. విశాఖపట్నం జిల్లా మాకవరంపాలేం జి కుండూరుకు చెందిన కొంత మంది టాటా ఏస్ వాహనంలో కాకినాడలో ఓ గృహ ప్రవేశం వేడుకకు హాజరయ్యారు. అక్కడ బంధుమిత్రులందరితో ఆహ్లాదంగా గడిపిన అనంతరం స్వగ్రామానికి తిరుగుపయనమయ్యారు.
గొల్లప్రోలు మండలం చేబ్రోలు వద్ద వీరు ప్రయాణిస్తున్న టాటా ఏస్ వాహనాన్ని వేగంగా దూసుకొచ్చిన టిప్పర్ ఢీకొట్టింది. 216 జాతీయ రహదారిపై చేబ్రోలు గ్రామ శివారు బైపాస్ రోడ్డు వద్ద ఈ దుర్ఘటన జరిగింది. టిప్పర్ రాంగ్ రూట్లో వచ్చి వేగంగా ఢీకొట్టడంతో టాటా ఏస్ వాహనం ఎగిరి మూడు పల్టీలు కొట్టినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. వీరంతా మహిళలే. తీవ్రంగా గాయపడిన మరో తొమ్మిది మందిని మొదట స్థానిక ఆస్పత్రికి, అక్కడ నుంచి కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more