‘మీటూ’ ఉచ్చులో చిక్కుకున్న కేంద్ర విదేశాంగ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి ఎంజే అక్బర్.. తనపై వస్తున్న అరోపణలను తోసిపుచ్చినా.. ఎట్టకేలకు తన పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని కేంద్ర విదేశాంగ మంత్రిత్వశాఖ వెల్లడించింది. తనపై తొలుత లైంగిక అరోపణలు చేసిన మహిళా జర్నలిస్టు ప్రియా రమణిపై న్యాయపోరాటానికి సిద్దపడిన ఆయన.. తనపై రోజురోజుకు మహిళా జర్నలిస్లుల నుంచి అరోపణలు ముంచెత్తుతుండటంతో.. చేసేది లేక తన పదవి నుంచి తప్పుకున్నారు.
ది ఏసియన్ ఏజ్ లో సంపాదకులుగా పని చేసిన సమయంలో అక్బర్ తమను లైంగికంగా వేధింపులకు గురి చేశారంటూ పలువురు మహిళా జర్నలిస్టులు ఆయనపై ఆరోపణలు చేశారు. ‘మీటూ’ ఉద్యమంలో భాగంగా పాత్రికేయురాలు ప్రియా రమణి తొలిసారిగా అక్బర్ పై ఆరోపణలు చేశారు. ఆమె తర్వాత మరుసటి రెండు రోజులకు ఆ సంఖ్య ఏడుకు పెరిగింది. ఈ క్రమంలో రమణిపై న్యాయపోరాటానికి అక్భర్ సిద్దం కాగానే ఆ సంఖ్య నేటికి 17కు చేరింది.
ఈ 17 మంది మహిళా జర్నలిస్టులు అక్బర్ తమను లైంగికంగా వేధించాడని ఆరోపణలు గుప్పించారు. తనపై కావాలని నిరాధార అరోపణలు చేస్తున్నారని, ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో కావాలనే ఇలాంటి అరోపణలు గుప్పించి.. తన పరువు మర్యాదలతో అడుకుంటున్నారని అయన పేర్కోన్నారు. ఇక తనపై తొలిసారిగా అరోపణలు గుప్పించిన ప్రియా రమణిపై న్యాయపోరాటానికి కూడా సిద్దమైన అక్బర్.. అమెపై పాటియాల న్యాయస్థానంలో పరువు నష్టం దావా కూడా వేశారు.
అన్ని అరోపణలను తాను న్యాయపరంగా ఎదుర్కొంటానని ధీమా వ్యక్తం చేసిన ఆయన మూడు రోజుల వ్యవధిలోనే తన పదవికి రాజీనామా చేశారు. ఆరోపణల నేపథ్యంలో ఆయన తన పదవికి రాజీనామా చేయక తప్పలేదు. కాగా, ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టులో ప్రియా రమణిపై ఆయన పరువునష్టం దావా వేశారు. ఇప్పటి వరకు అక్బర్ పై 15 మంది మహిళలు లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. తాజాగా తుషితా పటేల్ అనే మరో మహిళ ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడం గమనార్హం.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more