దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పు తరువాత ఇవాళే తొలిసారిగా కేరళలోని అయ్యప్పస్వామి ఆలయం తలుపులు తెరుచుకున్నాయి. అయితే ఆలయంలోకి ప్రవేశించేందుకు అన్ని వయసుల మహిళలకు అనుమతినిస్తూ అత్యున్నత న్యాయస్థానం తీర్పును వెలువరించడంతో తాము అయ్యప్ప స్వామి దర్శనం చేసుకుంటామని మహిళా భక్తులు వెళ్లడం.. వారికి అందోళనకారులకు మధ్య ఉద్రిక్తత రాజుకుంది.
ఈ క్రమంలో పంబానది వద్ద అక్కడి పరిస్థితులను, వార్తలను కవర్ చేసి తమ ఛానెళ్లకు చెప్పేందుకు వచ్చిన జాతీయ మీడియా మహిళా జర్నలిస్టులను కూడా అందోళనకారులు అడ్డుకున్నారు. వారిని పట్టించుకోకుండా ముందకు వెళ్తున్న వారిపై అందోళనకారులు దాడులకు దిగారు. వారు ప్రయాణిస్తున్న కార్ల అద్దాలను కూడా ధ్వంసం చేశారు. సుమారుగా నీలక్కల్ వద్ద వెయిమందికి పైగా పోలీసులు బందోబస్తు వున్నా అందోళనకారులు మాత్రం తమ అధిపత్యం ప్రదర్శించారు.
ఈ క్రమంలో ఉదయం ఆందోళనకారులను చెదరగొట్టిన పోలీసులు.. సరిగ్గా సాయంత్రం తలుపులు తెరుచుకునే సమయానికి కొన్ని గంటల ముందు అరెస్టులు కూడా చేశారు. పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు నీలక్కల్ వద్ద ఏకంగా 30 మంది అందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడ దాదాపుగా 200 మంది మహిళా పోలీసులతో పాటు మొత్తంగా వెయ్యి మంది పోలీసులు మహిళాభక్తులకు రక్షణగా నిలిచారు. కాగా సన్నిధానం వద్ద కూడా సుమారుగా 500 మంది పోలీసులు వున్నా తమను పట్టించుకున్న వారెవ్వరూ లేరని మహిళా భక్తులు అరోపిస్తున్నారు.
శబరిమల ఆలయంలోకి తన కుటుంబసభ్యులతో కలసి వెళ్తేందుకు యత్నించిన ఏపీ మహిళ మాధవికి నిరాశ ఎదురైంది. ఆమెతో పాటు కుటుంబసభ్యులను నిరసనకారులు అడ్డుకున్నారు. వారిని చుట్టుముట్టిన నిరసనకారులు గట్టిగా అరుస్తూ భయభ్రాంతులకు గురి చేశారు. ఈ సందర్భంగా మాధవి మాట్లాడుతూ, కొంత మంది పోలీసులు తమతో పాటు రక్షణగా వచ్చారని... అయితే ఆలయం సమీపిస్తున్న సమయంలో వారు వదిలేసి వెళ్లిపోయారని తెలిపారు. నిరసనకారుల తీరుతో తమ పిల్లలు ఏడ్చేశారని చెప్పారు. ఇక చేసేదేమీ లేక వెనక్కి వచ్చేశామని తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more