సరిగ్గా లక్ష రూపాయలిస్తే.. లెక్కసరిగ్గా వుందో లేదో చూసుకునేందుకు వాటిని పదే పదే లెక్కించే సగటు వ్యక్తులు.. తమ బ్యాంకు అకౌంట్ల ద్వారా మాత్రం ఏకంగా కోటానుకోట్ల రూపాయల లావాదేవీలు జరిపారు. తన అకౌంట్లో ఇంత డబ్బుతో లావాదేవీలు జరిగాయా.? అన్న విషయం కూడా ఆయనకు తెలియదు. అయితే అది తన అకౌంటేనన్న విషయం కూడా ఆటో డ్రైవర్ మార్చిపోయాడు. కానీ తాజాగా అధికారులు గుర్తుచేయడంతో.. అది తన అకౌంటేనన్న తెలిసి విస్మయానికి గురయ్యాడు.
అయితే ఇది జరిగింది మన దేశంలో కాదు. మన దాయాధి దేశమైన పాకిస్తాన్ లో. తన బ్యాంకు అకౌంట్ నుంచి రూ.300 కోట్ల లావాదేవీలు జరగడంపై పాకిస్థాన్ కు చెందిన ఓ ఆటోడ్రైవర్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. పాకిస్థాన్ దర్యాప్తు సంస్థ నుంచి అతనికి ఫోన్ కాల్ వచ్చే వరకూ ఈ విషయం అతనికి తెలియదు. కరాచీ పట్టణానికి చెందిన మహమ్మద్ రషీద్ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తుంటాడు. అతని బ్యాంక్ అకౌంట్ నుంచి రూ.300 కోట్ల లావాదేవీలు జరిగినట్టు ఫెడరల్ దర్యాప్తు సంస్థ (ఎఫ్ఐఏ) అధికారులు రషీద్ కు ఫోన్ చేశారు.
ఈ విషయమై అధికారులు అతన్ని ప్రశ్నించారు. ఇన్ని కోట్ల రూపాయల లావాదేవీలు ఎలా జరిగాయో తనకు తెలియదని అధికారులకు చెప్పాడు. అయితే దీనిపై లోతుగా విచారణ చేస్తున్న అధికారులు బాధితుడి అకౌంట్ ను బ్యాంకు అధికారుల సహకారంతో రాజకీయ నేతలు వినియోగించారా.? లేక ప్రముఖ వ్యాపారవేత్తలు వినియోగించారా.? అసలిది ఎలా జరిగిందన్న కోణంలో విచారిస్తున్నారు. కాగా, ఎఫ్ఐఏ అధికారుల విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన రషీద్, విచారణ నిమిత్తం అధికారులు తనను పిలవగానే భయపడిపోయానన్నారు.
తన అకౌంట్ వివరాలు చూపిస్తూ ఇన్ని కోట్ల లావాదేవీలు జరిగాయని చెప్పడంతో ఆశ్చర్యపోయానని చెప్పాడు. అసలు తన జీవితంలో ఇంత వరకూ ఒక లక్ష రూపాయలు కూడా చూడలేదని, అలాంటిది మూడొందల కోట్ల రూపాయల లావాదేవీలు తన అకౌంట్ ద్వారా జరిగాయంటే నోట మాట రావడం లేదని చెప్పాడు. ఇప్పటికీ, అద్దె ఇంట్లోనే తాను ఉంటున్నానని, తన అకౌంట్ ను ఎవరో ఉపయోగించు కుంటున్నారన్న అనుమానాన్ని వ్యక్తం చేశాడు. 2005లో ఓ ప్రైవేట్ కంపెనీలో కొన్ని నెలలు డ్రైవర్ గా పని చేసి మానేశానని, ఆ సమయంలో తన పేరిట బ్యాంకు ఖాతా తెరిచిన విషయాన్ని అధికారులకు చెప్పానని రషీద్ చెప్పుకొచ్చాడు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more