మద్యం ప్రియులకు దసరా పండగ వేళ శుభవార్త అందింది. ఇకపై మీరు ఏ మద్యం కావాలన్న ఇకపై అర్ఢర్ చేసి.. హ్యాపీగా ఇంట్లోనే కూర్చోని వాటిని సేవించ అవకాశం లభింభనుంది. తాగి మద్యం సరిపోక రోడ్డుపైకి వెళ్లి మద్యం తెచ్చుకునే క్రమంలో పోలీసులకు చిక్కి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులలో ఇరుక్కుని ఇబ్బందులు పడాల్సిన అవసరం ఇకపై లేదు. ఎందుకంటే అన్ లైన్ లో అర్డర్ చేస్తే.. మీ ముంగిట్లోకి లిక్కర్ వచ్చేస్తుంది. అయితే ఇది అన్ని ప్రాంతాల వారికి మాత్రం కాదు.
ఈ-కామర్స్ రంగం విస్తరించిన తర్వాత ఇంట్లో నుంచి కాలు బయటపెట్టకుండానే కావాల్సిన వస్తువును తెప్పించుకునే వెసులుబాటు లభించింది. గుండు పిన్నుల నుంచి ఎలక్ట్రానిక్ వస్తువుల వరకు, చింతపండు నుంచి చాయ్ పొడి వరకు అన్నీ ఇలా ఆర్డర్ చేస్తే అలా ఇంటికి వచ్చేస్తున్నాయి. ఇప్పుడిందులోకి మద్యం కూడా వచ్చి చేరింది. లిక్కర్ను డోర్ డెలివరీ చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అయితే, దీని వెనుక ఓ లక్ష్యం ఉన్నట్టు ప్రభుత్వం తెలిపింది.
డ్రంకెన్ డైవ్ కారణంగా పెరుగుతున్న ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ రాష్ట్ర ఎక్సైజ్ శాఖా మంత్రి చంద్రశేఖర్ బవాంకులే తెలిపారు. మద్యం ప్రియులు తాగి వాహనాలు నడుపుతున్నారని, ఫలితంగా ప్రమాదాల బారినపడి ప్రాణాలు కోల్పోతున్నారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి వాటికి చెక్ పెట్టేందుకే ఈ ప్రతిపాదన తీసుకొచ్చినట్టు చెప్పారు. అయితే, మద్యాన్ని ఎవరికి పడితే వారికి విక్రయించబోమని, ఆధార్ కార్డు తప్పనిసరి అని పేర్కొన్నారు.
మద్యం బాటిళ్లకు జియో ట్యాగింగ్ ఉంటుందని, కాబట్టి విక్రయాదారుడు-కొనుగోలుదారుడిని ఎప్పటికప్పుడు ప్రభుత్వం ట్రాక్ చేస్తుందని వివరించారు. మద్యాన్ని డోర్ డెలివరీ చేయడం వల్ల కల్తీ మద్యాన్ని అరికట్టడంతోపాటు స్మగ్లింగ్ కూడా తగ్గుతుందని మంత్రి పేర్కొన్నారు. ఈ విధానాన్ని కనుక అమల్లోకి తెస్తే.. మద్యాన్ని డోర్ డెలివరీ చేస్తున్న ఏకైక రాష్ట్రంగా మహారాష్ట్ర రికార్డులకెక్కుతుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more