దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మర్రి శశిధర్రెడ్డి దాఖలు చేసిన పిటీషన్ ను రాష్ట్రోన్నత న్యాయస్థానంలో దాఖలు చేయాలని సూచించింది. తెలంగాణలో 68 లక్షల బోగస్ ఓట్లను తొలగించకుండా ప్రభుత్వం ఎన్నికలకు వెళ్లిందని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ ఇటీవల సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో దీనిని విచారణకు స్వీకరించేందుకు నిరాకరించిన న్యాయస్థానం రాష్ట్ర హైకోర్టులో పరిష్కారించుకోవాలని అదేశిస్తూ ఈ క్రమంలో పలు సూచనలు చేసింది.
శశిధర్రెడ్డి దాఖలు చేసిన రిట్ పిటిషన్పై హైకోర్టుకు వెళ్లాలని అత్యున్నత న్యాయస్థానం సూచించిందని ఆయన తరపు న్యాయవాది జంధ్యాల రవిశంకర్ తెలిపారు. తెలంగాణ ఎన్నికలకు సంబంధించి దాఖలైన అన్ని పిటిషన్లను రేపే విచారించాలని హైకోర్టును ఆదేశించింది. ఒకవేళ ఎన్నికల ప్రక్రియపై స్టే విధించాల్సి వస్తే.. ఆ అధికారం హైకోర్టుకు ఉంటుందని స్పష్టం చేసింది. ఇక ఎన్నికలపై స్టే విధించాల్సి వస్తే ఆ అధికారం హైకోర్టుకు ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
బోగస్ ఓట్లను తొలగించకుండా ఎన్నికలకు వెళుతున్నారని కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి.. తరఫున పిటిషన్ దాఖలు చేసిన సీనియర్ న్యాయవాది జంధ్యాల రవిశంకర్.. ఈ ఓట్ల వ్యవహారం తేలేవరకూ ఎన్నికలను వాయిదా వేయాలని కోరారు. అంతేకాకుండా ఓటర్ల జాబితాలో చాలా అవకతవకలు ఉన్నాయని ఆరోపించారు. ఓటర్ జాబితా సవరణకు సోమవారం వరకే గడువు మిగిలిన నేపథ్యంలో సుప్రీంకోర్టు స్పందించింది.
దీంతో శుక్రవారం మధ్యాహ్నం 4 గంటలలోపు పిటిషన్ దాఖలు చేయాలని సూచించింది. ఈ కేసుకు సంబంధించి అన్ని పిటిషన్లను శుక్రవారమే విచారించాలని సుప్రీం న్యాయస్థానం హైకోర్టును ఆదేశించింది. తెలంగాణలో ఎన్నికలపై దాఖలైన అన్ని పిటిషన్లను ఇక కొత్తగా లేవనెత్తిన అభ్యంతరాలను హైకోర్టులోనే తేల్చుకోవాలని పిటిషనర్ కు జస్టిస్ సిక్రీ ధర్మాసనం సూచించింది. ఎన్నికలకు సంబంధించిన పిటిషనర్ అభ్యంతరాలను ఇప్పటికే హైకోర్టు విచారించి కొట్టేసిన విషయం తెలిసిందే.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more