పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్న క్రమంలో వాహనదారులపై ఎట్టకేలకు కరుణ చూపింది కేంద్ర ప్రభుత్వం. పెట్రోల్ ధరలు అంతర్జాతీయంగా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఎక్సైజ్ సుంఖాన్ని భారీగా పెంచిన కేంద్రం.. సుమారుగా ఏడాది క్రితం రూ. 2 తగ్గించి ఉపశమనం కల్పించింది. కాగా, మళ్లీ సెంచరీ దిశగా ఇంధన ధరలు పరుగులు పెడుతున్న క్రమంలో మళ్లీ ఇన్నాళ్లకు వాహనదారులపై కేంద్రం మరో రెండున్నర రూపాయలు తగ్గింది ఊరట కల్పించింది.
నాలుగేళ్లలో కేంద్రం విధించిన పన్నులో ఇంకా తొమ్మిది రూపాయల మేర తగ్గించాల్సి వున్నా.. కేంద్రం మాత్రం అంతర్జాతీయంగా ధరలు పెరిగిపోతున్న అంశాన్ని చూపుతుంది. అయినా ఈ తరుణంలో వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. లీటరు పెట్రోల్, డీజిల్ పై రూ. 2.50 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. తగ్గించిన ధరలు వెంటనే అమల్లోకి వస్తాయని ఆయన చెప్పారు.
అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతున్నాయని, ద్రవ్యలోటు తగ్గించేందుకు కృషి చేస్తున్నామని వివరించారు. చమురు ధరలపై రాష్ట్రాలు కూడా కొంత పన్నులు తగ్గించుకోవాలని సూచించారు. పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ డ్యూటీని తగ్గించిన కారణంగా కేంద్ర ప్రభుత్వం రూ.10,500 కోట్ల మేర ఆదాయాన్ని కోల్పోతుందని చెప్పారు. అమెరికాలో వడ్డీ రేట్లు ఎక్కువగా ఉండటం, రూపాయ బలహీన పడటం భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిందని అన్నారు.
అయితే అరుణ్ జైట్లీ నిర్ణయాన్ని పలువురు స్వాగతిస్తుండగా, ఆయన వినతిని కూడా పరిగణలోకి తీసుకున్న అనేక బీజేపి పాలిత రాష్ట్రాలు.. ఇంధన ధరలపై బ్యాట్ ను కూడా తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. అయితే కొన్ని రాష్ట్రాలు మాత్రం నాలుగేళ్లలో పెంచిన మొత్తాన్ని తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాయి. రూ.1.5 తగ్గింపుతో పది వేల 500 కోట్ల నష్టపోతున్నామన్న కేంద్రం.. ఇంధన ధరలపై రూ. 13 పెంచి ఎంత మేర లాభాన్ని అర్జించిందని ప్రశ్నిస్తున్నారు. ఇక కేంద్రం కేవలం రూపాయిన్నర తగ్గించగా, ఇంధన కంపెనీలు మరో రూపాయి నష్టాన్ని భరించనున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more