భారతదేశ భ్యాం‘కింగ్’ దిగ్గజం.. ప్రపంచ అతిపెద్ద బ్యాంకులలో ఒకటిగా కొనసాగుతున్న భారతీయ స్టేట్ బ్యాంకు.. తమ ఖాతాదారులకు మరోమారు షాక్ ఇచ్చింది. సరిగ్గా దసరా, దీపావళి పండగ సీజన్లో తమ ఖాతాదారులు డబ్బులు విత్ర్ డ్రా చేసే అంశంలో పరిమితులను సగానికి సగం తగ్గించింది. కేంద్ర ప్రభుత్వం నోట్ల రద్దు నేపథ్యంలో చెప్పిన అవినీతి, నల్లధన కుబేరులు, పన్ను ఎగవేతదారులు ఇత్యాది కారణాలు ఏ ఒక్కటి తీరకపోయినా.. సరిగ్గా నవంబర్ 9 నుంచి మెదలైన కరెన్సీ నోట్ల కటకట మొదలైంది.
బడాబాబులకు లెక్కపత్రం లేకుండా అడిగి అడగంగానే రుణాలు ఇచ్చి.. వాటిని రాబట్టుకునే చర్యల్లో కూడా అంతా అయిపోయన తరువాత చేతులు కాల్చుకుంటున్న ఈ దిగ్గజబ్యాంకు.. సామాన్య ఖాతాదారులపై మాత్రం ఇప్పటికే మినిమమ్ బ్యాలెన్స్ పేరుతో పెనాల్టీలను విధిస్తూ.. కోట్ల రూపాయలను వసూలు చేస్తూ తమ లొటును పూడ్చుకుంటున్న నేపథ్యంలో విమర్శలు వెల్లివిరిసినా.. పట్టించుకోని బ్యాంకు.. తాజాగా మరో నిర్ణయం తీసుకుని పండుగ వేళ తమ ఖాతాదారులను ఇబ్బందులకు గురిచేస్తుంది.
ప్రస్తుం రోజుకు ఏటీఎం కార్డు నుంచి మాక్సిమమ్ (గరిష్ట) విత్ డ్రా లిమిట్ పరిమితి రూ.40,000 ఉండగా, తాజాగా దాన్ని రూ.20 వేలకు కుదిస్తున్నట్లు ఎస్బీఐ తెలిపింది. ఈ నిర్ణయం అక్టోబర్ 31 నుంచి అమలులోకి వస్తుందని వెల్లడించింది. డిజిటల్ లావాదేవీలు పెంచాలన్న లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్బీఐ ఉన్నతాధికారి తెలిపారు. ఏటీఎంల వద్ద నగదు విత్ డ్రా సందర్భంగా మోసాలు జరుగుతున్నాయన్న ఫిర్యాదులతో తాజా నిర్ణయం తీసుకున్నామని వివరించారు.
బ్యాంకు నిబంధనల ప్రకారం క్యాష్ విత్ డ్రా లో మార్పులు చేస్తే 30 రోజుల ముందుగా కస్టమర్లుకు తెలియజేయాల్సి ఉంటుందన్నారు. ఈ విషయమై అన్ని బ్యాంకు బ్రాంచీలకు ఇప్పటికే సమాచారం అందజేశామన్నారు. రూ.20 వేల కన్నా ఎక్కువ మొత్తంలో విత్ డ్రా చేసుకోవాలంటే అందుకు అనువైన మరో కార్డు కోసం కస్టమర్లు బ్యాంకుకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. బ్యాంకు అధికారులు చెబుతున్న కారణాలతో మాత్రం ఖాతాదారులు అసంతృప్తిని కబనరుస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more