తెలుగు రాష్ట్రాలలో పెను సంచలనం సృష్టించిన పెరుమాళ్ల ప్రణయ్ పరువుహత్య కేసులో రాజకీయ నేతల జోక్యం కూడా వుందన్న వార్తలను వెలుగులోకి వస్తున్నాయి. తన కూతురు ప్రణయ్ తో వివాహం చేసుకున్న తరుణంలో దానిని జీర్ణంచుకోలేని మారుతిరావు.. తన అంగబలం, అర్థబలంతో పాటు తన అల్లుడిని హత్య చేయించాలని ముందస్తుగానే ప్రణాళికను రచించుకున్నాడని, అందుకు అనుగూణంగానే ఆయన అధికార పార్టీలో చేరి రాజకీయ బలాన్ని కూడా కూడగట్టుకునే ప్రయత్నం చేశాడని దళిత సంఘాలు నుంచి అరోపణలు వస్తున్నాయి.
ఈ క్రమంలో ముందుగా కాంగ్రెస్ మిర్యాలగూడ అధ్యక్షుడు కరీంను పోలీసులు అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ నేత కరీం సహా మారుతీరావు, శ్రావణ్ కుమార్, మరో ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రణయ్ భార్య అమృత తండ్రి తిరునగరు మారుతీరావు ఏ1 నిందితుడు, అతడి సోదరుడు శ్రావణ్ కుమార్ ఏ2 నిందితుడిగా పేర్కొన్న పోలీసులు కరీం సహా ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించారు. ప్రణయ్పై కత్తితో దాడిచేసిన నిందితుడి కోసం రెండు ప్రత్యేక బృందాలు తీవ్రంగా గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
కాగా, హత్యనంతర పరిణామాలను కూడా ముందే అంచనా వేసిన మారుతిరావు ఆయన సోదరుడు శ్రావణ్.. తప్పించుకునేందుకు రాజకీయ అండ వెతుకున్నట్టు తెలుస్తోంది. ఆర్నెళ్ల క్రితమే మంత్రి కేటీఆర్ సమక్షంలో మారుతీరావు అధికార పార్టీలో చేరారని, మంత్రి జగదీశ్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా మారుతీరావు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, ఆయనతో దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికార, విపక్షాలు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి.
కాగా, ప్రణయ్ని హత్య చేయించడంలో అధికార పార్టీకి చెందిన నకిరేకల్ తాజా మాజీ ఎమ్మెల్యే హస్తం ఉన్నట్లు భావిస్తున్నానని బాధితురాలు అమృతవర్షిణి అరోపించింది. తన తండ్రి మారుతీరావు వద్ద డబ్బులు తీసుకుని కిరాయి హంతకులను రప్పించి, మిర్యాలగూడలో వాళ్లు ఉండడానికి ఎమ్మెల్యే సాయం చేశాడని అనుమానాలను వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంలో ఆయన రాజీ కుదిర్చేందుకు కూడా ప్రయత్నించారని పేర్కొంది.
పెళ్లైన తరువాత కొన్ని రోజులకు తనను, ప్రణయ్ని రమ్మని ఆయన పిలిచారని, వెళ్లకపోయేసరికి ప్రణయ్ తండ్రిపై అక్రమ కేసు పెట్టించారని మీడియాకు అమృత చెప్పింది. తన తండ్రితో సహా హత్యతో ప్రమేయమున్న వారందరికీ ఉరి శిక్ష వేయాలని ఆమె డిమాండ్ చేసింది. అమాయకుడైన తన భర్తను చంపిన వారిని, అంతకంటే ఘోరమైన రీతిలో చంపితేనే మరోసారి ఇలాంటి ఘటనలు జరగవని భోరున విలపించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more