car speeds in telangana and fan in andhra pradesh ఇక్కడ కారు జోరు.. అక్కడ ప్యాను హుషారు.. సర్వే జోస్యం..

Car speeds in telangana and fan in andhra pradesh

KCR, Uttam kumar reddy, CM candidate, PM Modi, Rahul Gandhi, Chandra Babu, YS Jagan, India-today, India-today survey, india today axis survey, telugu states, Politics

Telangana's caretaker Chief Minister KCR is far ahead of any competition as the state prepares for early polls, and fan is in full speed in andhra pradesh, according to the findings of India Today's Political Stock Exchange (PSE).

ఇక్కడ కారు జోరు.. అక్కడ ప్యాను హుషారు.. సర్వే జోస్యం..

Posted: 09/15/2018 01:48 PM IST
Car speeds in telangana and fan in andhra pradesh

2019 సార్వత్రిక ఎన్నికలు హాట్ టాఫిక్‌గా మారగా, మరోవైపు రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు వేడెక్కితున్నాయి. తెలంగాణలో ముందస్తు ఎన్నికల హడావుడి, అలాగే ఆంధ్రప్రదేశ్‌లో కాబోయే ముఖ్యమంత్రి పదవికి ఎవరు దక్కించుకుంటారనే వార్తలు ప్రాధాన్యత సంతరించుకుంటున్నాయి. దీంతో సర్వేలకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఓ వైపు ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ సర్వే అంటూ.. మీడియాలో హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా నిర్వహించిన సర్వే ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణలో టీఆర్ఎస్‌ పార్టీకే ప్రజలు మళ్లీ పట్టం కడతారని, ఇక ఏపీలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికే ముఖ్యమంత్రి పీఠం దక్కనున్నట్లు ఈ సర్వేలో తేలింది. నాలుగున్నరేళ్ల చంద్రబాబు పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో ఏపీలో అధికార మార్పిడి తథ్యమని ఈ సర్వేలో వెల్లడి అయింది. అంతేకాకుండా టీడీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు కంటే వైఎస్ జగన్‌కే ప్రజాదరణ ఎక్కువ ఉన్నట్లు సర్వే పేర్కొంది.

హుషారుగా వీస్తున్న ఫ్యాను ..

ఆంధ్రప్రదేశ్‌కు కాబోయే ముఖ్యమంత్రి ఎవరనే దానిపై ప్రజలు తమ అభిప్రాయాన్ని సర్వే ద్వారా స్పష్టం చేశారు. సీఎం అభ్యర్థిత్వం విషయానికొస్తే  వైఎస్ జగన్‌ మోహ న్‌రెడ్డికి 43%, చంద్రబాబు నాయుడుకు 38%, జనసేన నేత పవన్‌ కళ్యాణ్‌కు 5% మద్దతు ప్రకటించారు.  సెప్టెంబర్ 8 నుంచి 12 వరకూ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో 10,650 మంది అభిప్రాయాలను సేకరించడం జరిగింది. ఈ సర్వేపై శుక్రవారం రాత్రి ఇండియా టుడే ఛానెల్‌లో ‘పొలిటికల్‌ స్టాక్‌ ఎక్స్‌ఛేంజ్‌’ పేరిట నిర్వహించిన కార్యక్రమంలో పలు అంశాలపై చర్చ జరిగింది.

సర్వే సానుకూలంగా రావడంతో వైఎస్సార్ సీపీ శ్రేణుల్లో ఉత్సాహం వెల్లివిరుస్తోంది. మరోవైపు టీడీపీ మాత్రం ఈ సర్వే ఫలితాలను కొట్టిపారేసింది. రాబోయే ఎన్నికల్లో కూడా తమదే విజయం అంటూ ధీమా వ్యక్తం చేస్తోంది. గత ఎన్నికలకు ముందు కూడా ఇలాంటి సర్వేలు అనేకం వచ్చాయని, అయితే సర్వేల ఫలితాలను తిరగరాస్తూ తమ పార్టీ అధికారంలోకి వచ్చిందని పార్టీ శ్రేణులు అయితే ఈ ట్రెండ్ ఎన్నికల వరకూ కొనసాగుతుందో లేదో చూడాలంటే ఎన్నికలు జరిగి, ఫలితాలు వచ్చేవరకూ వేచి చూడాల్సిందే.

తెలంగాణలో జోరందుకున్న కారు..

తెలంగాణలో మళ్లీ గులాబీ గుభాళించనుంది. ముందస్తు ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకే ప్రజలు పట్టం కట్టనున్నట్లు ఈ సర్వేలో తేలింది.  తెలంగాణ అసెంబ్లీని ఎనిమిది నెలల ముందుగానే రద్దు చేసి ముందస్తుకు సిద్ధమైన కేసీఆర్‌ కారులో దూసుకుపోతున్నారు. తదుపరి సీఎంగా కేసీఆర్‌కు 43 శాతం మంది మద్దతు తెలిపారు. ఆ తర్వాత తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌కు 18శాతం మంది మొగ్గు చూపారు. తెలంగాణలోని అన్ని పార్లమెంటరీ నియోజకవర్గాలో జరిగిన ఈ సర్వేలో మొత్తం 7,110మంది పాల్గొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : KCR  Uttam kumar reddy  CM candidate  PM Modi  Rahul Gandhi  Chandra Babu  YS Jagan  India-today  telugu states  Politics  

Other Articles