హైదరాబాద్ మహానగరంలోని ఈశాన్య, నైరుతి ప్రాంతాల్లో విషాదం అలుముకుంది. నగరంలోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని గచ్చిబౌలి చౌరస్తాలో ఇవాళ ఉదయం ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించి ముగ్గురి జీవితాలను అర్థంతరంగా చిదిమేయగా, మరో ఘటనలో ఉప్పల్ కు చేరువలోని రామంతపూర్ లో దుకాణం నుంచి తన తండ్రి చేయి పట్టుకుని ఇంటికి వెళ్తున్న ఓ ఐదేళ్ల చిన్నారి జీవితాన్ని మృత్యుశకటంలా వచ్చిన అటో చిదిమేసింది.
గచ్చిబౌలిలోని ఘటనలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ డిపోకు చెందిన బస్సు లింగంపల్లి నుంచి కోఠి వెళ్తోంది. ఉదయం 8 గంటల సమయంలో గచ్చిబౌలి చౌరస్తా వద్దకు చేరుకున్న బస్సు మరో బస్సును తప్పించబోయి రోడ్డు దాటుతున్న పాదచారుల పైకి ఒక్కసారిగా దూసుకెళ్లింది. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. మృతుల్లో దశరథ్ అనే ఆటో డ్రైవర్ కూడా ఉన్నాడు. మిగిలిన ఇద్దరి ఆచూకీ కోసం పోలీసలుఉ విచారణ చేపట్టారు. వీరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు.
ఇక మరో ఘటనలో ఉప్పల్ పొలిస్ స్టేషన్ పరిధిలో ఆటో ఢీకొన్ని ఐదేళ్ల బాలుడు మృతిచెందాడు. పూర్తిగా మద్యం మత్తులో వున్న అటో డ్రైవర్ తన అటోపై నియంత్రణ కొల్పోవడంతో రామంతాపూర్ శారదనగర్ కాలనీకి చెందిన ఉమేష్ భార్య పిల్లలతో కలిసి షాపింగ్ కు వెళ్లాడు. రోడ్డుపై నడుస్తుండగా వేగంగా వస్తున్న ఆటో వీరిపై దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఉమేష్ కు స్వల్పగాయాలవ్వగా... చిన్నారి మోహిత్ కు తీవ్రగాయాలయ్యాయి. దీంతో మోహిత్ ను ఆస్పత్రికి తరలించగా మార్గమధ్యంలోనే చనిపోయాడు. రోడ్డుపై వెళ్తున్న బైక్ ను తప్పించే క్రమంలో ఆటోడ్రైవర్ వాహనాన్ని పక్కకు తీసుకురావడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో ఆటోడ్రైవర్ శివను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more