అధికార పార్టీ చెందిన కార్యకర్తలు, నాయకులకే పోలీసులు సలామ్ చేస్తున్న రోజులువి. ఇక అలాంటిది ఓ అధికార ప్రజాప్రతినిధి అందులోనే అధికార పార్టీ ఎమ్మెల్యే అంటే చట్టం జేబులో చుట్టంగా మారిపోతుందని ఇప్పటికే అనేక ఘటనలు మనకు నిరూపించాయి. ఇక దేశవ్యాప్తంగా రెండు పదుల రాష్ట్రాల్లో అధికారంలో కొనసాగుతున్న బీజేపీకి కొత్తగా వచ్చిన అధికారపు రెక్కలు మాత్రం వారిని విమర్శల పాటు చేస్తున్నాయి. బీజేపి ఎమ్మెల్యేల ఆగడాలకు అంతూపొంతూ లేకుండా పోతోంది. అటు జాతీయవాదం, ఇటు హిందూ ధర్మం అంటూ చెప్పుకుంటున్న ఆ పార్టీ నేతలు.. స్వయంగా ప్రధాని నరేంద్రమోడీ చెప్పిన మాటలను కూడా చెవికెక్కించుకోవడం లేదు.
సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అన్న ప్రధాని చెప్పిన వ్యాఖ్యలను విస్మరిస్తూ ఓక్కో నేత ఒక్కో తరహాలు వివాదాస్పద వ్యాక్యలు చేస్తూ పార్టీ గౌరవాన్ని మంటగలుపుతున్నారు. మొన్న మహారాష్ట్ర బీజేపీ ఎమ్మల్యే రామ్ కదమ్ మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం మర్చిపోకముందే ఉత్తరాఖండ్లోని రుద్రపూర్ బీజేపీ ఎమ్మెల్యే రాజ్కుమార్ తుక్రాల్ పోలీస్ స్టేషన్లో వీరంగమేశారు. ట్రాఫిక్ రూల్స్ను ఉల్లంఘించిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న మహిళా సబ్ ఇన్స్పెక్టర్ అనితా డైరోలాపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బూతులు తిట్టారు. ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారు. పోలీస్ స్టేషన్ ఆవరణలోనే ఇష్టానుసారం మాట్లాడారు.
ఓ వాహనంపై వెళ్తున్న జంటను ఆపిన అనిత వాహన పత్రాలు చూపించమని అడిగారు. వారు చూపించకపోవడమే కాకుండా ఎస్సైను దుర్భాషలాడారు. దీంతో ఆమె వారిని అదుపులోకి తీసుకుని వాహనాన్నిపోలీస్ స్టేషన్కు తరలించారు. విషయం తెలిసిన తుక్రాల్ పోలీస్ స్టేషన్కు వచ్చి అనితపై రెచ్చిపోయారు. వారిని విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాకెక్కి వైరల్ అయింది. ఈ ఘటనపై సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సదానంద దాతె మాట్లాడుతూ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more