Petrol and diesel prices at lifetime high againజీవితకాల గరిష్టానికి ఇంధన ధరలు..

Petrol and diesel prices at lifetime high again

oil price, crude oil, price hike, petrol, diesel, dharmendra pradhan, goods and service tax, petrol price, diesel price

Fuel prices have been on a continuous rise recently, due to which consumers have taken to social media and other platforms to complain of the additional expense.

జీవితకాల గరిష్టానికి ఇంధన ధరలు..

Posted: 09/01/2018 04:01 PM IST
Petrol and diesel prices at lifetime high again

పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ఆల్ టైం రికార్డుకు చేరుకున్న ధరలు క్రమంగా వాటి రికార్డులను అదే అధిగమిస్తూ మునుపెన్నడూ లేని శిఖరాలను అందుకుంటున్నాయి. ఇంతలా ధరలు పెరుగుతున్నా.. ప్రజల కోసమే పనిచేస్తున్నామని చెబుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వాహనదారులను మాత్రం కనుకరించడం లేదు. అధికారంలోకి వచ్చిన తరువాత పెంచిన ఎక్సైజ్ సుంఖాన్ని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఉపసంహరించుకునే చర్యలను చేపట్టడం లేదు. ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ పరిధిలోకి వచ్చే విలువ అధారిత పన్నును తగ్గించుకునే చర్యలకు పూనుకోకపోవడంతో వాహనదారులు పర్సులకు చిల్లులు పడుతున్నాయి.

క్రితం రోజున పైకి ఎగబాకిన ఇందన ధరలు జీవితకాలం అత్యధిక ధరకు చేరుకుని రికార్డును నెలకొల్పగా, ఇవాళ మరోమారు పెరిగిన ధర.. నిన్నటి రికార్డును అధిగమిస్తూ పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడం, రూపాయి విలువ పతనమవడంతో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. మేలో అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్‌ ముడి చమురు ధర 80.42 డాలర్లు పలకడంతో దేశీయంగా పెట్రోల్ ధరలు  భారీగా పెరిగాయి. మే 29న దేశ రాజధానిలో లీటర్ పెట్రోల్‌ ధర రూ. 78.43గా ఉంది.  ఇది ఢిల్లీలో ఆల్ టైం రికార్డు.  

ఇప్పుడా రికార్డు చెరిగిపోయింది. ఢిల్లీ లీటరు పెట్రోల్ ధర రూ.78.68 గా ఉంది.  ముంబైలో రూ. 86.09, కోల్‌కతాల రూ.81.60, చెన్నైలో రూ.81.72, హైదరాబాద్‌లో 83.30 గా ఉంది. ఇక డీజిల్ ధరల విషయానికొస్తే.. ముంబై రూ. 74.76, కోల్‌కతాలో రూ. 73.27, చెన్నైలో రూ. 74.39, హైదరాబాద్‌లో 76.42గా ఉంది.  ముడి చమురు ధరలు పెరగడంతో పాటు చమురు రవాణాపై విధిస్తున్న ఎక్సైజ్‌ సుంకం కారణంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. మరికొన్ని రోజులు ఇలాగే ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.

కాగా, గతంలో ఇంధన ధరలు పెరిగిన క్రమంలో కేంద్రఇంధన శాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్ ఈ అంశంపై పలుమార్లు మీడియా ముందుకు వచ్చి.. ఇంధన ధరలపై విధిస్తున్న సుంకం విషయంలో కేంద్రం తగ్గింపుకు యోచిస్తుందని చెప్పేవారు. కానీ ఈ పర్యాయం ఇంధన ధరలు ఏకంగా తన రికార్డులను తానే వెనువెంటనే చెడుపుతూ పోతున్నా.. మంత్రివర్యులు కనీసం స్పందించకపోవడం వాహనదారులను అగ్రహానికి గురిచేస్తుంది. దేశప్రజలపై జీఎస్టీని బలవంతంగా రుద్దిన ప్రభుత్వం ఇంధన ధరలను మాత్రం ఎందుకు ఆ జాబితాలోకి తీసుకురాలేదని ప్రశ్నిస్తున్నారు వాహనదారులు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles