పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ఆల్ టైం రికార్డుకు చేరుకున్న ధరలు క్రమంగా వాటి రికార్డులను అదే అధిగమిస్తూ మునుపెన్నడూ లేని శిఖరాలను అందుకుంటున్నాయి. ఇంతలా ధరలు పెరుగుతున్నా.. ప్రజల కోసమే పనిచేస్తున్నామని చెబుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వాహనదారులను మాత్రం కనుకరించడం లేదు. అధికారంలోకి వచ్చిన తరువాత పెంచిన ఎక్సైజ్ సుంఖాన్ని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఉపసంహరించుకునే చర్యలను చేపట్టడం లేదు. ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ పరిధిలోకి వచ్చే విలువ అధారిత పన్నును తగ్గించుకునే చర్యలకు పూనుకోకపోవడంతో వాహనదారులు పర్సులకు చిల్లులు పడుతున్నాయి.
క్రితం రోజున పైకి ఎగబాకిన ఇందన ధరలు జీవితకాలం అత్యధిక ధరకు చేరుకుని రికార్డును నెలకొల్పగా, ఇవాళ మరోమారు పెరిగిన ధర.. నిన్నటి రికార్డును అధిగమిస్తూ పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడం, రూపాయి విలువ పతనమవడంతో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. మేలో అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడి చమురు ధర 80.42 డాలర్లు పలకడంతో దేశీయంగా పెట్రోల్ ధరలు భారీగా పెరిగాయి. మే 29న దేశ రాజధానిలో లీటర్ పెట్రోల్ ధర రూ. 78.43గా ఉంది. ఇది ఢిల్లీలో ఆల్ టైం రికార్డు.
ఇప్పుడా రికార్డు చెరిగిపోయింది. ఢిల్లీ లీటరు పెట్రోల్ ధర రూ.78.68 గా ఉంది. ముంబైలో రూ. 86.09, కోల్కతాల రూ.81.60, చెన్నైలో రూ.81.72, హైదరాబాద్లో 83.30 గా ఉంది. ఇక డీజిల్ ధరల విషయానికొస్తే.. ముంబై రూ. 74.76, కోల్కతాలో రూ. 73.27, చెన్నైలో రూ. 74.39, హైదరాబాద్లో 76.42గా ఉంది. ముడి చమురు ధరలు పెరగడంతో పాటు చమురు రవాణాపై విధిస్తున్న ఎక్సైజ్ సుంకం కారణంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. మరికొన్ని రోజులు ఇలాగే ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.
కాగా, గతంలో ఇంధన ధరలు పెరిగిన క్రమంలో కేంద్రఇంధన శాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్ ఈ అంశంపై పలుమార్లు మీడియా ముందుకు వచ్చి.. ఇంధన ధరలపై విధిస్తున్న సుంకం విషయంలో కేంద్రం తగ్గింపుకు యోచిస్తుందని చెప్పేవారు. కానీ ఈ పర్యాయం ఇంధన ధరలు ఏకంగా తన రికార్డులను తానే వెనువెంటనే చెడుపుతూ పోతున్నా.. మంత్రివర్యులు కనీసం స్పందించకపోవడం వాహనదారులను అగ్రహానికి గురిచేస్తుంది. దేశప్రజలపై జీఎస్టీని బలవంతంగా రుద్దిన ప్రభుత్వం ఇంధన ధరలను మాత్రం ఎందుకు ఆ జాబితాలోకి తీసుకురాలేదని ప్రశ్నిస్తున్నారు వాహనదారులు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more