తెలంగాణలో ముందస్తు ఎన్నికల ప్రచారం జోరందుకోగా.. ఏపీలోనూ ఎన్నికల వాతావారణం వేడెక్కింది. పార్టీలు చేరికలను ప్రోత్సహిస్తున్నాయి. ముఖ్యంగా తొలిసారి ఎన్నికల బరిలో దిగబోతున్న సినీనటుడు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీలో చేరడానికి ఏకంగా నాయకులు క్యూ కడుతున్నారా.? అంటే ఔనన్న సమాధానమే వినబడతుతుంది. అయితే ఇప్పటికే అవినీతి, అక్రమాలకు పాల్పడి.. జనం చేత విమర్శలను ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు, నాయకులకు మాత్రం తమ పార్టీలోకి ఎంట్రీ లేదని ఇప్పటికే పవన్ కల్యాణ్ తేల్చిచెపిన విషయం తెలిసిందే.
పవన్తో 40 మంది టీడీపీ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని జనసేన నాయకులు ప్రకటించడం గతంలో సంచలనమైంది. తాజాగా జనసేన పార్టీ రాష్ట్ర కన్వీనర్ వి.పార్థసారథి మరోసారి అలాంటి ప్రకటనే చేశారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ కు చెందిన 25 మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని పార్థసారథి తెలిపారు. ఆ ఎమ్మెల్యేలంతా ఇప్పటికే పవన్తో చర్చించారని, ఆయన నిర్ణయం తీసుకుని, తేదీ ఖరారు చేసిన తర్వాత వారంతా వచ్చి పార్టీలో చేరుతారని పేర్కొన్నారు. వివిధ పార్టీలకు చెందిన పలువురు ముఖ్యనేతలు కూడా జనసేనలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. పాత, కొత్త తరం మేలు కలయికతో పార్టీ ముందుకెళ్తుందని ఆయన తెలిపారు.
అయితే సీనియర్ నాయకులు, సిట్టింగ్ నేతలు ఎంతమంది చేరినా.. తమ పార్టీలో నవతరానికి 60 శాతం సీట్లు ఇచ్చేందుకు పవన్ కల్యాన్ నిర్ణయించారని ఆయన పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల కోసం రాష్ట్రం మొత్తానికి ఓ మేనిఫెస్టో, ఒక్కో నియోజకవర్గానికి ఒక్కోటి చొప్పున మేనిఫెస్టోలు తయారుచేస్తామని పార్థసారథి వివరించారు. శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా జనసేన అధ్యక్షుడు మేడా గురుదత్ ప్రసాద్, ఉభయ జిల్లాల కన్వీనర్ కలవకొలను తులసితో కలిసి రాజమహేంద్రవరంలో పార్థసారథి విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయాలు వెల్లడించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more