ముంబైలో మరో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. బుధవారం ఉదయం పరేల్ ప్రాంతంలోని బహుళ అంతస్తుల భవనంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. హిమదాతా సినిమాస్ సమీపంలోని క్రిస్టల్ టవర్లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. క్రిస్టల్ టవర్ 12 వ అంతస్తులో మంటలు చెలరేగడంతో భవనంతా పొగ వ్యాపించింది. ఉవ్వెత్తున మంటలు ఎగిసిపడుతుండటంతో జనం భయాందోళనకు గురవుతున్నారు. ఈ అగ్ని ప్రమాదాన్ని ముందు లెవెల్-2గా భావించినా తర్వాత తీవ్రతను బట్టి లెవెల్-3గా అంచనా వేశారు.
ప్రమాదం గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపుచేయడానికి ప్రయత్నిస్తున్నారు. సహాయక చర్యల్లో భాగంగా 20 ఫైర్ ఇంజిన్లతో మంటలను ఆర్పుతున్నారు. భవనంలో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటి వరకూ ఎవరూ గాయపడలేదని తెలుస్తోంది. ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు. మంటలను పూర్తిగా అదుపులోకి తేవడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు.
ఉదయం 8.30 గంటల ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగినట్టు సమాచారం వచ్చినట్టు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. సమాచారం అందిన పది నిమిషాల్లోనే ఘటనా స్థలానికి చేరుకున్నట్టు వారు తెలియజేశారు. లోపల చాలా మంది చిక్కుకున్నట్టు భావిస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని అంటున్నారు. భారీ క్రేన్లను ఉపయోగించి 12 వ అంతస్తులోని మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.
పై అంతస్తులో చిక్కుకుపోయిన చాలా మందిని క్రేన్ల సాయంతో బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే లోపల ఎంతమంది చిక్కుకుపోయారో ఇంకా తెలియరాలేదు. ఘటనలో ఇప్పటి వరకు ఎవ్వరికీ గాయాలు కాలేదని, పై అంతస్తుల నుంచి రక్షించిన వైద్య పరీక్షల నిమిత్తం కేఈఎం ఆస్పత్రికి తరలిస్తున్నామని అధికారులు తెలిపారు. పరిస్థితి నియంత్రణలోనే ఉందని, సిబ్బంది మంటలను పూర్తిగా ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారని తెలియజేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more