అధికార, విపక్షాల మధ్య ఉత్కంఠతకు దారితీసిన రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికలలో అధికార బీజేపి వ్యూహ, ప్రతివ్యూహాలు ఫలించాయి. తమ ఎన్డీయే కూటమి అభ్యర్థి హరివంశ్ నారాయణ్ సింగ్ ను వవిజయం వరించేలా బీజేపి చేసిన ప్రయత్నాలు సఫలమయ్యాయి. అధికార పక్షానికి చెందిన హరివంశ్ నారాయణ్ సింగ్ జేడీ(యు) అభ్యర్థిగా రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాగా విపక్ష కాంగ్రెస్ కు చెందిన అభ్యర్థి హరిప్రసాద్ ను ఆయన 20 ఓట్ల మెజారిటీతో ఓడించారు. అధికార పక్ష అభ్యర్థికి 125 ఓట్లు పోలవ్వగా విపక్షానికి చెందిన అభ్యర్థికి 105 ఓట్ల మాత్రమే లభించాయి. దీంతో హరివంశ్ సింగ్ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గా ఎన్నికైనట్లు చైర్మన్ వెంకయ్యనాయుడు వెల్లడించారు.
ఇవాళ ఉదయం 11 గంటలకు రాజ్యసభ ప్రారంభమైన తరువాత వెంకయ్యనాయుడు నామినేషన్లు వేసిన హరివంశ్, హరిప్రసాద్ పేర్లను ప్రకటించి ఓటింగ్ ప్రక్రియను ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. ఆ తరువాత లాబీలను క్లియర్ చేయాలని ఆదేశించారు. ఆపై మూజువాణీ ఓటు ద్వారా హరివంశ్ గెలిచినట్టు ప్రకటించారు. విపక్ష సభ్యులు డివిజన్ కావాలని పట్టుబట్టడంతో ఓటింగ్ నిర్వహించారు. డివిజన్ బెల్ మోగించారు. హరివంశ్ నారాయణ్ కు 115 ఓట్లు, హరిప్రసాద్ కు 98 ఓట్లు వచ్చాయి. సభలో మొత్తం 230 మంది ఉండగా, ఇద్దరు ఎంపీలు ఎవరికీ ఓటు వేయలేదని కౌంటింగ్ నంబర్ బోర్డు తెలిపింది.
దీంతో హరివంశ్ నారాయణ్ విజయం సాధించారని వెంకయ్య నాయుడు ప్రకటించారు. అయితే కొంతమంది రాజ్యసభ సభ్యులు తాము పొరపాటు పడ్డామని, ఓటింగ్ తప్పుగా వేశామని చెప్పారు. మరికొందరు తాము ఓటు వేయలేదని ఫిర్యాదు చేయడంతో మరోసారి డివిజన్ చేశారు. అప్పుడు హరివంశ్ కు 125 ఓట్లు, హరిప్రసాద్ కు 105 ఓట్లు రాగా, ఇద్దరు ఎవరికీ ఓటు వేయలేదు. దీంతో హరివంశ్ గెలుపును వెంకయ్యనాయుడు ప్రకటించారు. కాగా, రాజ్యసభ ఉపసభాపతి అధ్యర్థిగా ఎన్నికైన హరివంశ్ సింగ్ కు ప్రధాని మోడీ సహా పలువురు సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు.
PM Narendra Modi congratulates NDA Candidate Harivansh Narayan Singh who was elected as Rajya Sabha Deputy Chairman pic.twitter.com/lTy2yRpxik
— ANI (@ANI) August 9, 2018
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more