అనారోగ్యంతో కావేరి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న డీఎంకే కురువృద్ధుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ఆరోగ్య మరింతగా క్షీణించింది. ఈ వార్త తెలియడంతో రాష్ట్రం నలుమూలల నుంచి ఆయన అభిమానులు, డీఎంకే పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో రాజధాని చెన్నైలోని కావేరి అసుపత్రి వద్దకు చేరుకున్నారు. ఆయన ఆరోగ్యంగా తిరిగిరావాలని ప్రార్థనలు చేస్తున్నారు. అయితే కరుణానిధి కోసం వస్తున్న కార్యకర్తలు అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో వారిని అదుపు చేసేందుకు సుమారు 500 మంది పోలీసులు మోహరించారు. ఆస్పత్రి బయట ఉద్విగ్న, ఉద్రిక్త, గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.
కాగా వారం రోజుల క్రితం విషమించిన కరుణానిధి అరోగ్యం కోలుకున్న తరువాత.. రెండు రోజుల క్రితం ఆయన అరోగ్యం విషమించింది. డాక్టర్లు తమ ప్రయత్నాలు తాము చేస్తున్నా.. వయోభారం వల్ల కరుణానిధి శరీరంలో ఎలాంటి మార్పూ కనిపించడం లేదని వైద్యులు తెలిపారు. 24 గంటలు గడిస్తే కానీ ఆయన అరోగ్యం విషయంలో ఏమీ చెప్పలేమని చెప్పిన వైద్యులు.. కరుణానిధి ఆరోగ్యం విషయంలో ఈ రోజు సాయంత్రం 6 గంటల తర్వాత ఆస్పత్రి వర్గాలు హెల్త్ బులెటిన్ ను విడుదల చేసే అవకాశాలు వున్నాయని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో కరుణానిధి తనయుడు, డీఎంకే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి నివాసానికి వెళ్లారు. ఆయనతో పాటు డీఎంకేకు చెందిన మరో ముగ్గురు సీనియర్ నేతలు కూడా వెళ్లి సీఎంను కలిశారు. కరుణానిధి ఆరోగ్యం గురించి, ఆయనకు అందిస్తున్న చికిత్స గురించి సీఎంకు వివరించారు. గత రెండు రోజులుగా కరుణానిధి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడం.. ఈనేపథ్యంలో సీఎంతో స్టాలిన్ భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more