వెనుకబడిన తరగతుల జాబితాలో వున్న కులాలకు జాతీయ కమిషన్ (ఎన్సీబీసీ) ఏర్పాటుకు మార్గం ఏర్పడింది. ఎన్సీబిసీకి రాజ్యాంగ హోదాను కల్పించే 123వ రాజ్యాంగ సవరణ బిల్లు పార్లమెంటు అమోదం లభించింది. గత ఏడాది ఈ బిల్లును ప్రవేశపెట్టి చేతులు కాల్చుకున్న అధికార పార్టీ.. ఈ సారి రాజ్యసభలోనూ తమకు మోజారిటీ వున్న కారణంతో పాటు ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరించి.. ఏకగ్రీవంగా అమోదింపజేసుకుంది. ఇప్పటికే ఈ బిల్లును లోక్సభ ఆమోదించింది. ఇప్పుడు పెద్దలసభ కూడా ఆమోదించడంతో బిల్లుకు పార్లమెంటు ఆమోదం లభించినట్టయింది.
తాజా బిల్లు ప్రకారం వెనుకబడిన తరగతుల వారిని చేర్చడం, లేదా తొలగించాలనే అభ్యర్థలను పరిశీలించడం, ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి సూచనలిచ్చే అధికారం నేషనల్ కమిషన్కు లభిస్తుంది. గత మంగళవారంనాడే లోక్సభలో ఈ బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. సభకు హాజరైన వారంతా బిల్లుకు అనూకూలంగా ఓటేయడంతో మూడింట రెండొంతులకు పైగా మెజారిటీతో బిల్లుకు ఆమోదం లభించింది. అయితే ఈ కమీషన్ లో సభ్యురాలిగా ప్రతిపక్ష పార్టీలకు మహిళా ఎంపీకి స్థానం కల్పిస్తామని సవరణ చేయడంతో ఈ బిల్లు రాజ్యసభలో ఏకగ్రీవంగా అమోదం పోందింది.
కాగా ఈ కమీషన్ లో మైనారిటీకి చెందిన వారు కూడా సభ్యులుగా వుండాలన్న షరతును విధించిన ప్రతిపక్షాలు ఆ డిమాండ్ ను ఉపసంహరించుకోవడంతో.. బిల్లుకు పార్లమెంటు అమోదం లభించింది. దీంతో బీసిల సంక్షేమానికి మోదీ సర్కార్ కట్టుబడిందనే సంకేతాలను పంపుతూ ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీ) ప్రయోజనాలను పరిరక్షించేలా, వారి హక్కులను కాపాడేందుకు పూర్తి అధికారాలను ఎన్సీబీసీకి కట్టబెడుతూ దానికి రాజ్యాంగ హోదా కల్పించే బిల్లును ఆమోదింపచేయడం ప్రభుత్వ విజయంగా బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ బిల్లుకు రాజ్యసభలో ఆమోదం లభించడంపై బీజేపీ అధ్యక్షుడు అమిత్షా హర్షం వ్యక్తం చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more