హర్యానాలో దారుణం చోటుచేసుకుంది. దేశవ్యాప్తంగా బిన్నత్వంలో ఏకత్వాన్ని చవిచూస్తు అత్యంత పెద్ద ప్రజాస్వామ్య, లౌకిక దేశంగా బాసిల్లుతున్న భారతావనిలో.. హిందూ, ముస్లిం బాయ్.. భాయ్.. అనే రోజులు పోయి.. వీడు ముస్లిం.. వీడు హిందూ అనే రోజులు వస్తున్నాయా..? అన్నట్లుగా అందోళన కలిగించే ఘటన హర్యానాలో చోటుచేసుకుంది. ఓ ముస్లిం యువకుడ్ని మతం పేరుతో తీవ్రంగా దూషించిన ముగ్గురు దుండగులు.. అతను ఎదురు తిరగడంతో దాడి చేసి.. బలవంతంగా సెలూన్ కు లాక్కెళ్లి గడ్డాన్ని తీయించారు. గత నెల 31న ఈ ఘటన చోటుచేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
హర్యానాలోని మేవాట్ లో ఉంటున్న జఫ్రుద్దీన్ తన స్నేహితుడిని కలుసుకునేందుకు గురుగ్రామ్ కు వచ్చాడు. ఈ సందర్భంగా ఖాన్సా మండీ ప్రాంతంలో కొందరు దుండగులు జఫ్రుద్దీన్ ను మతం పేరుతో దూషించడం మొదలుపెట్టారు. అయినా జఫ్రుద్దీన్ పట్టించుకోలేదు. చివరికి వేధింపులు మరింత ఎక్కువ కావడంతో దుండగులకు, జఫ్రుద్దీన్ కు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో జఫ్రుద్దీన్ పై దాడికి పాల్పడ్డ నిందితులు.. సమీపంలోని సెలూన్ కు లాక్కెళ్లి బలవంతంగా అతని గడ్డం తీయించారు.
ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే చంపేస్తామని బెదిరించినా.. తన మనోభావాలు గాయపడ్డాయని, నన్ను తిట్టినా పడే వాడిని.. నా దేవుడిని దూషించి.. అల్లా కోసం పెంచుతున్న నా గడ్డాన్ని కూడా తీయించడంతో పరాభావానికి గురైన జాఫ్రుద్దీన్ తాను పోలీసులకు తప్పకుండా పిర్యాదు చేస్తానని మరీ వార్నింగ్ ఇచ్చాడు. అన్నట్లుగానే మరుసటి రోజు ఉదయాన్నే తమ కుటుంబసభ్యులతో కలసి సెక్టార్ 37 పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ ఘటనకు సంబంధించి ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన గౌరవ్, ఏకలాస్ తో పాటుగా హర్యానాకు చెందిన నితిన్ అనే నిందితుడిని కూడా అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు. అయితే కేవలం ఇది అకతాయిల పనే తప్ప.. వీరి వెనుక ఏ మత సంస్థలు లేవని పోలీసులు తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more