ఉత్తర కర్ణాటకను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలని నిరసనలు మిన్నంటుతున్న వేళ.. ఆ డిమాండ్ ను చల్లార్చేందుకు ముఖ్యమంత్రి తన వ్యూహాలకు పదనుపెట్టారు. ఇప్పటికే తాను చేసిన వ్యాక్యలు అఖండ కర్ణాటక సమైఖ్యతకు విఘాతం కలిగించేవిలా వున్నాయని.. ప్రధాన ప్రతిపక్షం బీజేపి విమర్శలు చేస్తున్న క్రమంలో నష్టనివారణా చర్యలకు కుమారస్వామి పూనుకున్నారు. ఉత్తర కర్ణాటకలోని ప్రధాన పట్టణమైన బెళగావిని రెండో రాజధానిగా ప్రకటించాలని ఆయన ప్రతిపాదించారు. బెళగావిలో ఉన్న సెక్రటేరియేట్ భవనం 'సువర్ణ విధాన సౌధా' లోకి కొన్ని ప్రభుత్వ కార్యాలయాలను తరలిస్తామని కూడా ఆయన హామీ ఇచ్చారు.
కాగా, జేడీ(ఎస్) - బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న 2006లోనే, బెళగావిని రెండో రాజధానిగా చేయడానికి ఏకగ్రీవ తీర్మానాన్ని అసెంబ్లీలో ఆమోదించిన సంగతి తెలిసిందే. మహారాష్ట్రలో నాగపూర్, జమ్మూ కాశ్మీర్ లో జమ్మూ మాదిరిగా కన్నడ నాట కూడా రెండు రాజధానుల ఏర్పాటుకు అడుగులు పడ్డా, అవి పన్నెండేళ్లుగా దస్త్రాలకే పరిమితమయ్యాయి. ఇటీవల బెల్గాం ప్రాంతం కర్ణాటకలో భాగమేనని మహాజన్ కమిషన్ రిపోర్టు ఇవ్వడంతో, దాన్ని అమలు చేసే దిశగా కుమారస్వామి ఇప్పుడు అడుగులు వేస్తున్నారు.
"నేను 2006లో సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఈ డిమాండ్ పెండింగ్ లో ఉంది. ఆ తరువాతి ప్రభుత్వాలు ఈ ప్రతిపాదనలను పక్కనబెట్టాయి. బెళగావిని రెండో రాజధానిగా ప్రకటించే అంశంపై నేను ఆలోచిస్తున్నా. ఈ విషయమై సాధ్యమైనంత త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం" అని కుమారస్వామి వెల్లడించారు. కాలాబుర్గి, బెళగావి, హుబ్లీ-ధార్వాడ్ ప్రాంత ప్రజలు ప్రతి విషయానికీ సుదూరంలో ఉన్న బెంగళూరుకు రావడం కష్టమనే విషయాన్ని తాము గుర్తించామని కుమారస్వామి వ్యాఖ్యానించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more