మాయమైపోతున్నడమ్మా.. మనిషన్నవాడు.. మచ్చకైనా లేడు చూడు మానవత్వం వున్నవాడు.. అంటూ గాయకులు ఎన్ని పాటలను అలపించినా.. నిజంగా మనిషన్నవాడు మాత్రం మార్పుకే ఓటువేస్తూ అటువైపుకే పయనాన్ని లాగిస్తున్నాడు. సాంకేతిక విప్లవంతో ప్రతీ ఒక్కరి చేతిలోకి స్మార్ట్ ఫోన్ వచ్చి చేరగానే.. పనిపాట లేని వాడు కూడా ఎంతో పనివున్నవాడిలో అందులోనే జీవించేస్తున్నాడు. ఇలాంటి తరుణంలో అదే సోషల్ మీడియాలో లైవ్ వీడియో తీసుకుంటూ ఆత్మహత్యకు పాల్పడిన ఓ వ్యక్తి.. వీడియోను అతని గ్రూపులోని 2300 మంది వీక్షించినా.. వారిలో ఒకరు కూడా కనీసం పోలీసులకో, వారి కుటుంబసభ్యులకో సమాచారం మాత్రం ఇవ్వలేదు.
వివరాల్లోకి వెళ్తే.. గుర్గావ్కు సమీపంలోని జతోలికి చెందిన అమిత్ చౌహాన్ సోమవారం సాయంత్రం 7.10 నిమిషాల సమయంలో ఫేస్బుక్ లైవ్ ఆన్ చేశాడు. తాను చనిపోతున్నానని.. ఈ వీడియోనూ షేర్ చేయాలని చెప్పాడు. లైవ్ స్ట్రీమ్లోనే ఫ్యాన్కు చున్నీ కట్టి.. ఉరి వేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు. దాదాపు రెండు గంటల పాటూ ఈ లైవ్ అలాగే కొనసాగింది. 2వేలమందికిపైగా ఈ వీడియోనుచూశారు. తర్వాత అతడి భార్య వచ్చి చూసేదాక ఆత్మహత్య చేసుకున్న విషయం బయటపడలేదు.
చౌహాన్ ఆత్మహత్య విషయాన్ని కుటుంబ సభ్యులు బయటకు రానివ్వలేదు. అతడి అంత్యక్రియలు కూడా వెంటనే పూర్తి చేశారు. కొంతమంది స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ వ్యవహారం అందరికి తెలిసింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. ఆత్మహత్యకు కారణాలను ఆరా తీశారు. కుటుంబ కలహాల వల్లే చౌహాన్ ప్రాణాలు తీసుకున్నాడట. ఘటనకు అరగంట ముందే భార్యతో గొడవపడగా.. కొద్దిసేపటి తర్వాత ఆమె ఇద్దరు పిల్లల్ని తీసుకొని పొరుగింటికి వెళ్లింది. ఆమె తిరిగి ఇంటికి వచ్చేలోపే అతడు ఉరి వేసుకున్నాడు.
కుటుంబ కలహాలు మాత్రమే కాదు.. చౌహాన్ మానసిక స్థితి కూడా సరిగా లేదంటున్నాడు అతడి తండ్రి. భార్యను కూడా తరచూ కొట్టేవాడని.. చౌహన్కు ఆస్పత్రిలో ట్రీట్మెంట్ కూడా జరుగుతోందన్నాడు. అయితే ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వకుండా.. అంత్యక్రియలు నిర్వహించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కోణంలోనే పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more