జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో కోస్త్రాంధ్ర పోరాట యాత్రలో భాగంగా.. అటు పర్యటనలు ఇటు పార్టీని బలోపేతంపై కార్యచరణను రచిస్తున్న ఆయన యాత్రకు స్వల్పంగా బ్రేక్ పడింది. తన కోసం దూర ప్రాంతాల నుంచి వచ్చిన పలువురు ప్రతినిధులను, పార్టీ జనసైనికులను కలిసేందుకు వెళ్లి.. తిరిగివస్తున్న ఆయనకు లెగ్ ఇంజ్యూరీ (కాలు బెణికింది) అయ్యింది. భీమవరంలోని ఎన్డీ ఫంక్షన్ హాల్ లో బస చేసిన పవన్ కల్యాణ్ ను కలిసేందుకు పార్టీ కార్యకర్తలు, వివిధ వర్గాల ప్రతినిధులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు.
వారితో సమావేశమైన పవన్ కల్యాణ్ వారి సమస్యలను అర్థం చేసుకుని వారిని పంపించారు. ఇక పార్టీ కార్యకర్తలు, నాయకులు కూడా పెద్ద సంఖ్యలో రావడంతో.. వారితోనూ ఆయన చర్చలు జరిపారు. పార్టీని బలోపేతం చేయడానికి ప్రతీ ఒక్క కార్యకర్త సైనికుడిలా పోరాడాలని హితోపదేశం చేశారు. సమాజంలో మంచికి, రాజకీయాల్లో మార్పు.. ప్రజాసేవ కోసం వచ్చిన పార్టీయే జనసేన అని.. కమీషన్లు, అధికారం, ఓట్లు, నోట్ల కోసం కాదని ఇదే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ఆయన కార్యకర్తలకు సూచించారు.
కాగా, వారితో మాట్లాడి తిరిగి వెళ్తున్న సమయంలో అక్కడి గచ్చు తడిగా ఉండటంతో ఆయన కాలు జారడం.. బెణకడం జరిగిందని ‘జనసేన’ ఓ ప్రకటనలో పేర్కొంది. దీంతో పార్టీ క్రియాశీలక నేతల సమాచారం మేరకు హుటాహుటిన వచ్చిన వైద్యులు పవన్ ను పరీక్షించారు. పవన్ కాలుకి క్యాప్ వేశారని, కాలు నొప్పి లేకుండా ఉండేందుకు పెయిన్ కిల్లర్స్ వాడాలని, ఆయనకు స్వల్ప విశ్రాంతి అవసరమని సూచించినట్టు తెలిపింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more